Tuesday, November 9, 2021

ఏది వాత్సల్యం? ఏది మాత్సర్యం? 2


వాత్సల్యం - దానం
మనిషికి మరణానంతరం పనికొచ్చేవి 'సత్సంతానం, జ్ఞానం, దానం' అని ప్రవక్త మహినీయులు (స) వారు సెలవిచ్చారు. అది తెలిసిన తలగట్టి తత్వవేత్తలు, మహా మేధావులెందరో తమ సంపత్తిని, సమయాన్ని, సేవని, జ్ఞానాన్ని లోక కళ్యాణం కోసం వినియోగించారు. అయితే లోకం వీళ్ళని 'బ్రతకడం చేతకాని వాళ్ళంటూ అవహేళన చేసింది. ఎంత విచి త్రం! ఎది ఏమయినా, మనం మాత్రం మన పిల్లల్లో దాన గుణాన్ని పెంపొందించాలి. అప్పుడప్పుడు వారి చేతికి డబ్బిచ్చి దానం చేయించాలి. పుచ్చుకోవడం కన్నా ఇవ్వడం ద్వారా పొందే ఆనందం చెప్పనలవి కానిది. 

మన పిల్లలకు పుస్తకాలున్నాయి, బట్టలున్నాయి, కాళ్ళకు చెప్పులున్నాయి. ఇవేమి లేనివాళ్ళు, మనకన్నా చిన్నవాళ్ళూ మన చుట్టూ ఎంతో మంది కనబడతారు. కాబట్టి “మీకున్న దానిలో కాస్త స్వీటు ఆ అభాగ్యులకు ఇచ్చి చూడండి. వారి కళ్ళల్లో కనబడే ఆనందం మీరు స్వీటు తింటున్నప్పుడు కలిగే ఆనంద మకరందంకన్నా మీకె క్కువ సంతోషాన్నిస్తుంది' అని పిల్లలను ప్రోత్సహిస్తే, సత్పౌరులయిన వారు వేలాది దానాలకు, వందలాది సేవా కార్యక్రమాలకు తలకట్టుగా నిలబడి, నిరతం నింగీ నేలల్లో జీవరాసుల చేత నీరాజనాలందుకుంటారు.



వాత్సల్యం - సావాసం
సావాసగాళ్ళందరూ మంచి వారై ఉంటారన్న గ్యారంటి ఏమి లేదు. కొందరి మెదడు మోకాళ్లలో ఉంటుంది. తలకు చెప్పులు అడిగే రకం అన్న మాట. అంటే కొవ్వెక్కి మాట్లాడుతారు. తలమీరిపోతూ, తలకు నొప్పిని మిగిల్చే పనులన్నింటిలోనూ తలదూరుస్తుంటారు. అటువంటి వ్యక్తులకు, ఉక్తులు, చెడు శక్తులకు దూరంగా ఉంచితేగాని మన పిల్లలకు శాంతి తలకూడదు. ఎంత కష్ట పడ్డా అవతలివారు. ఒక్కోసారి మనల్ని అభిమానించరు. ఆఖరికి తలకోసి ముందర పెట్టినా 'ఇదంతా తలతిక్క వ్యవ హారం, గారడీ విద్య లాగుంద'ని చప్పరించి పారేస్తారు. అటువంటి వ్యక్తుల ప్రాపకం కోసం వృధా ఊడిగం చెయ్యకూడదని పిలల్లకు నచ్చ జెప్పాలి. తలకోట్లు నూరి బట్టతలకూ మోకాలుకూ ముడివేసే జిత్తులమారి నక్కలుంటారని జాగరూక పర్చాలి.

చెడు సావాసం వల్ల భారత దేశంలో ఏటా 'లైంగిక వేధింపులకు గురయిన పిల్లల సంఖ్య అక్షరాల 6 లక్షలు. అందులో 67 శాతం బాలి కలయితే, 33 శాతం బాలురుగా నమోదయింది. ఈ సర్వేలో మన పిల్లల్ని ఎత్తుకునే - వారు, స్వీట్లు, చాక్లెట్లు పంచి పెట్టే వారు,
ఆప్తులయినా, అధ్యాపకులయినా, వైద్యులయినా, స్నేహితులయినా - వారందరూ మంచో ళ్ళయి ఉండరని తేలింది. కాబట్టి మనం మన పిల్లల్ని మూడు ప్రదేశాలకు సంబంధించిన ప్రమాదాన్ని ఆరు నెలలకోసారి అయినా గుర్తు చేస్తూ ఉండాలన్నది. కొందరు మానసి నిపు ణుల మాట. 1) రొమ్ము 2) తొడలు, తొడల -మధ్య స్థలం 3) పిర్రలు. ఎవరయినా వారిని ఎత్తుకుని ముద్దాడుతూ ఈ ప్రదేశాలను తాకితే ప్రమాదం పొంచి ఉన్నట్టు అని మన పిల్లలకు బోధ పర్చడంతోపాటు తక్షణ చర్యల్ని కూడా సూచించాలి. వారికి అలా అన్పించినప్పుడు పెద్దగా కేక వేసి, ఆ స్థలం నుండి పారిపోయి సురక్షిత ప్రదేశానికి చేరుకోవాలని, తర్వాత వారికి బాగా నమ్మకమున్న వ్యక్తికి దాని గురించి తెలియజేయాలని చెప్పాలి. అలాగే ఏదైనా విషయం మన పిల్లలు మనతో చెబితే పసివాళ్లు కదా అని ఈజీగా తీసిపారేయకూడ దు. లేదంటే తర్వాత మనం చాలానే కోల్పో వాల్సి వస్తుంది. చివరకు సంతానాన్ని కూడా. అలాగే ఈ మూడు ప్రదేశాల్ని మనం చూస్తుండగా ఎవరయినా ముట్టుకుంటే వారు ఎంతటి వారయినా మందలించాలి. -అదే విధంగా పిల్లలతోనే ఎక్కు సమయం గడిపే ఆడ మగవారి పట్ల కాస్త అప్రమత్తంగా ఉండాలి. పరాయి వారు ఎవరు ఏది ఇచ్చినా తీసుకో కూడదని చెప్పాలి. మనం కూడా ఇతర పిల్లలకు ఏదైనా ఇవ్వాలనుకుంటే డైరెక్టుగా పిల్లలకు ఇవ్వకూడదు, వారి తల్లి దండ్రులకిచ్చి వారికి ఇవ్వాలిస్సదిగా రిక్వెస్ట్ చేయాలి. కోరికలు తీరని కామాంధులు కొందరుంటారు. వారి చూపంతా కన్నె పిల్లల పై, చిన్న పిల్లలపైనే అన్న విషయాన్ని విస్మరించడం విషంతో సమానం అన్న విషయం గర్తుంచుకోవాలి.

వాత్సల్యం - శీల నిర్మాణం
"Think High-Acheive High" అనేది నేటి నినాదం. ఉన్నత లక్ష్యాల్ని నిర్దేశించుకుని దాని మీదే తదేక దృష్టితో పని చేయాలనే నిర్ణయం తీసుకునే తలచూపును తనయులకు తల్లిదండ్రులు ఇవ్వాలి. 'తల తిరిగి అయినా కబళం నోటికి రావాలి' అన్నట్టు అవకాశాలు వాటికవే రావు. వాటిని మనమే అంది పుచ్చుకోగలగాలని, ఎవరో వస్తారని, ఏదో మేలు చేస్తారని ఎదురు చూసి మోసపో కూడదని వారికి నచ్చజెప్పాలి. ఒక్కొక్క మెట్టు తలదొక్కుకెళుతూ శిఖరాగ్రానికి చేరుకునే నేర్పును వారిలో నూరి పోయాలి. తలతాకట్టు పెట్టాల్సి వచ్చినా తీసుకున్న అప్పు, ఇచ్చిన మాట తప్ప కూడదని బోధించాలి.

అలాగే స్త్రీ ఇంటికి గుమ్మ వంటిదని, వీధి వాకిట్లో నిలబడి వచ్చి పోయేవాళ్ళతో ఒయ్యా రాలు ఒలకబోస్తూ మాట్లాడటం, కరచాలనం చేయడం ఏ విధంగానూ తగదని, సంస్కారం, వ్రీడ గల సుకన్యలు గుమ్మంలోకి రారని, అలా వీధి గుమ్మంలో నిలబడటం జారస్త్రీ లక్ష ణం అని పెద్దలు చెప్పిన మాటను ఆడ పిల్లలకు నచ్చివచ్చేలా బోధించాలి.

వాత్సల్యం -కామం (వాంఛలు)
తాము అనుభవించలేకపోయిన సౌఖ్యాల్ని, సౌకర్యాల్ని తమ  పిల్లలకు అందేలా చూడాలన్న తపన దాదాపు తల్లిదండ్రులందరిలోనూ ఉంటుంది. అయితే ఏ కోరికల పరిపూర్తి  వల్ల పిల్లల వ్యక్తిత్వం పరిపూర్ణమవుతుందో, మరే రకపు వాంఛల పరిపూర్తి వల్ల వారి భవితవ్యం బుగ్గి పాలవుతుందో తెలుసుకునే కనీస విచక్ష జాజ్ఞానం తల్లిదండ్రులకు లేకపోతే.......తలవుళ్ళు కడిగాము, ఇవ్వాళ ప్రయోజకులయి సంపద వచ్చే సరికి అన్ని మర్చిపోయారు' అని తీరిగ్గా కూర్చోన్ని బాధ పడక తప్పదు. కనుక పిల్లలు, తలతిక్క పనులు చేసినా, తలకెక్కిన కోర్కెలు కోరినా వారిని మందలించాలి. వాటి వల్ల కలిగే నష్టాన్ని వివరించాలి, అప్పటికీ వినకపోతే 'తలకోల పోట్లగిత్తకు ఇది అవసరం' అన్నట్టు నాలుగు తగిలించాలి కూడా. తప్పని స్థితిలో కొట్టడం వాత్సల్యానికి వ్యతిరేకం ఎంత మాత్రం కాదు, అది మనకు వారి మీదున్న వాత్సల్య అవసరం. అయితే గొడ్డును బాదినట్టు బాదడం గానీ, చీకటి గదిలో బంధించడంగానీ, అన్నం మాన్పించడం, వాతలు పెట్టడం, కళ్ళల్లో కారం పోయడం వంటివి గాని చేయకూడదు.

'తలలు బోడులయినా తలపులు బోడులవుతాయా?' అన్నట్టు వయసుతోపాటు వచ్చే మార్పు వారిని వింతానుభూతికి లోను చేస్తుంది. అప్పటి వరకు తల్లిదండ్రులే సర్వ స్వం అయిన వారి లోకంలోకి కొత్త పరిచయాలు తొంగి చూడాలన్న తాపత్ర్యం బయలు దేరుతుంది. అట్టి క్లిష్ట స్థితిలో వారు స్పందించాల్సిన తీరును, వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని వారికి నేర్పాలి. 'పిల్లలు పదవ ఏటకు చేరితే (వారు స్వంత అన్నాచెల్లెలయినా, అక్కాతమ్ము ళ్లయినా) వారి పడకలను వేరు చేయమ'ని ప్రవక్త (స)వారు సెలవిచ్చి ఉన్నారు. అలాగే సమీప బంధువుల మధ్య ఉండే అతి సనువుకు వారిని దూరంగా ఉంచాలి. ఈ నియమాన్ని ఖచ్చితంగా మన ఇళ్ళల్లో అమలు పర్చాలి.

వాత్సల్యం - సహనం
'తలచినప్పుడే తాత పెళ్ళి' అన్నట్టు తొందర పాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడాలి. చక్కటి మైత్రినీ, స్నేహాన్నీ, నడవడినీ కలిగి ఉంటూ, అందరి 'తలలో నాలుకలా తయారవ్వాలని హితవు పలకాలి. అవినీతి, కుళ్ళుమోతుతనం, ఎదుటి వారి అభివృద్ధిని సహించకపోవడం వంటి కొట్లమారితనం అనే గుణానికి దూరంగా ఉండమని బోధించాలి.భావోద్వేగ నిబద్ధతను వారిలో నూరిపోయాలి. కష్టమొచ్చినప్పుడు కంగారు పడకుండా అటు వంటి నిబద్ధతతో సమస్యకు పరిష్కారం దొరకుతుందని బోధపర్చాలి.

వాత్సల్యం - వ్యాయామం
ఏడు సంవత్సరాల వరకు పిల్లల్ని ఆడుకోనివ్వాలని, తర్వాత వారికి నమాజు గురించి చెప్పాలని' ప్రవక్త మహనీయులు (స) వారి ప్రవచనం ద్వారా తెలుస్తుంది. వ్యాయామం అనేది రెండు రకాలు. క్రీడా వ్యాయామం , విద్యా వ్యాయామం.  సాధారణంగా పిలల్లలో చాలా హడావిడి, చురుకుతనమూ ఉంటుంది. వాటిని శక్తిగా మార్చాలి. ఈ హడావుడి అనేది 'పాము విషం' లాంటిది. చంపటానికి, బ్రతికిం చడానికి కూడా పనికొస్తుంది. చిన్నతనంలో మన పిల్లల చురుకుదనాన్ని సవ్యమయిన మార్గంలో మళ్ళించకపోతే, పెద్దయ్యాక అది 'కంగారు'గా మారుతుంది. కాబట్టి కొందర వ్యక్తుల్ని మనం చూస్తాము. వారు చాలా చిన్న విషయాలకే హడావుడి పడుతూ ఉంటారు. సమస్యల్ని తొందరగా పరిష్కరించాలనే తాపత్ర్యంతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ  ఉంటారు. నిజానికి అప్పుడే నిగ్రహం'పాటిం చాలి. దీన్ని చిన్నతనం నుంచే పిల్లలకు నేర్పాలి. 

ఫజిల్స్, పొడుపు కథల్లాంటివి చెప్పి విప్పమనాలి. తేలిక ప్రశ్నే కదా అని పిల్లలు హడావుడి జవాబులు చెబుతారు. అది తప్పయినప్పుడు వారికి 'నిగ్రహం' విలువని చెప్పాలి. భవిష్యత్తులో ఆ నిబద్ధతే వారికి చాలా సాయపడుతుంది. ఇది విద్యా వ్యాయామం. క్రీడా వ్యాయామం - పిల్లలు కొందరిలానే ఫలితం తెలియకుండా పని చేస్తారు. ఒక కుర్రాడు గది చుట్టూ చక్కర్లు కొడుతున్నాడనుకుందాం. 'ఎక్కడికి నీ పరుగు? ఏ గమ్యం చేరుకోవడానికి?" అని ప్రశ్నిస్తే వాడి దగ్గర సమాధానం ఉండదు. వారి లోపల్నుంచి ఉవ్వెత్తు ఎగిసి పడుతున్న శక్తిని కాల్చేయడం కోసమే పిల్లలు ఆ విధంగా పరుగెత్తడం, గంతులేయడం, అతిగా మాట్లాడటమ, కొట్టుకోవడం, బల్లపై నుంచి దూకడం వగైరా చేస్తూ ఉంటారు. నిరంతరం వారిలో విడుదలయ్యే 'అంతర్గత శక్తి'ని మంచి దారిన మళ్ళిస్తే వారు అద్భుతమైన వ్యక్తులుగా ఎదుగుతార న్నది మానసిక నిపుణుల మాట. కాబట్టి వారి పరుగుకి, వేగానికి, దూకుడికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించడం పెద్దల బాధ్యత. అయితే ఈ మధ్య తల్లిదండ్రులు పేరు కోసమో, ప్రాపకం కోసమో తెలియదుగానీ, వారి పిల్లల అంతర్గత శక్తిని పెద్దయ్యాక వారికి ఏ విధంగానూ పనికి రాని పాటల పోటీల్లో, డ్యాన్స్ పోటీల్లో తగులబెట్టి మురిసి పోతున్నారు. వారు ఈ చర్యకు స్వస్తి పలకకపోతే, 'పధ్నాల్గో  ఏట నుంచి పబ్బులకు, క్లబ్బులకెళ్ళే సంతానమే-సంతాపమే' వారికి మిగులుతుందని మరువ కూడదు.

వాత్సల్యం - ప్రోత్సాహం
'తల వెంట్రుకకు కూడా నీడ ఉంటుంది' అన్నట్టు మనం చాలా చిన్నవిగా భావించి అశ్రద్ధ వహించే విషయాలలో మహోపకారాలు చేసేవి చాలానే ఉంటాయి. అది మెచ్చుకోలుగా భుజం తట్టడమే కావచ్చు, నగుమోముతో మాట్లాడటమే కావచ్చు, బహుమానం ఇవ్వడమే కావచ్చు, విహారయాత్రకు తీసుకెళ్ళడం కావచ్చు. అయితే మన పొగడ్తకు, ప్రోత్సాహానికి, చిరునవ్వుకు, ఇచ్చే బహుమానానికి ఒక లక్ష్యం ఉండాలి. మనం ఎందుకు వారిని మెచ్చుకుంటున్నామో, ఎందుకు వారితో నవ్వుతూ మాట్లాడుతున్నామో, ఎంత గా వారిని ప్రేమిస్తున్నామో, ఎందుకు బహుమానాన్ని ఇస్తున్నామో వారి అర్థమయ్యే రీతిన చెప్పగలగాలి. నాన్న గనక గిఫ్ట్ ఇచ్చాడు అన్న ఫీలింగ్ కన్నా 'నేను సాధించిన ఫలానా విజయానికి మెచ్చుకోలుగా నాకు లభించిన బహుమానం ఇద'ని అతను సంతృప్తి, సంతోషం చెందాలి. 
ఒక వేళ మన పిల్లలు ఏదోక కారణంగా దిగులు చెందినట్టు మనకు అన్పిస్తే, వారిని వారి మానాన వదలకుండా - 'గాలి ప్రేమతో స్పర్శించి ప్రేమగా పలుకరించినట్లు, చెట్ల కొమ్మలు చెతులూపుతూ ధైర్యం చెప్పి నట్లు, పర్వతాలు స్థిరంగా ఉండటం ఎలాగో నేర్పినట్లు మనం వారికి ఒక అనురాగ స్పర్శ ను, ఒక అభయ హస్తాన్ని, ఒక సహన స్థయి ర్యాన్ని ఇవ్వగలగాలి. ఇస్తారని ఆశిస్తూ.......!



అందరూ అనుభవించే బాల్యం.. దేవుడు మనందరికీ  ఇచ్చిన ఓ అమూల్యమైన వరం. అభం శుభం తెలియని ఆ పసి మనసులు పూతోటలో అప్పుడే పరిమళించిన పువ్వులు. అందుకు సూచకంగా ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలో బాలల దినోత్సవంలు జరుపుకుంటారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం బాలల దినోత్సవాన్ని నవంబర్ 20న అధికారికంగా జరుపుకుంటుంటారు. అయితే 1954కి ముందు అక్టోబర్ నెలలో బాలల దినోత్సవాన్ని జరుపుకునేవారు. ఐక్యరాజ్యసమితి నిర్ణయించిన ప్రకారం బాలల దినోత్సవాన్ని మొదటిసారిగా 1954లో ప్రపంచమంతటా నిర్వహించారు. 1959 నవంబర్ 20న బాలల హక్కుల ప్రకటనను ఐరాస సర్వసభ్య సభ రూపొందించిన సందర్భంగా బాలల దినోత్సవాన్ని ప్రపంచ మంతటా జరుపుకోవాలని నిర్ణయించారు.1989లో పిల్లల హక్కులపై నవంబర్ 14న ఓ బిల్లును ఐరాస ఆమోదించింది. ఈ బిల్లును ఆమోదిస్తూ 191 దేశాలు సంతకాలు పెట్టాయి కూడా. పిల్లలు తమ భావాలను, సమాచారాన్ని పంచుకోవడాన్ని, పరస్పర అవగాహనను పెంచుకోవడాన్ని ప్రోత్సహించేందుకు గాను ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ బాలల దినోత్సవానికి రూపకల్పన చేసింది. ప్రపంచమంతటా పిల్లల సంక్షేమాన్ని ప్రోత్సహించేందుకోసం పలు చర్యలు చేపట్టడం ఈ దినోత్సవం లక్ష్యం.

బాలల దినోత్సవాన్ని ఒక్కో దేశం ఒక్కో రోజున జరుపుకుంటుంది. చైనాలో జూన్‌ 1వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటారు.
పాకిస్తాన్‌లో నవంబర్‌ 20వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటారు.  జపాన్‌లో మే 5న జరుపుకుంటారు.  దక్షిణ కొరియాలో మే 5వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటారు. పోలాండ్ లో జూన్‌ 1న బాలల దినోత్సవం చేసుకుంటారు. శ్రీలంకలో అక్టోబర్‌ 1 అంటే పండుగే. పెద్దలు తప్పనిసరిగా వారిని బయటకు తీసుకెళతారు.

మన దేశంలో ప్రతి సంవత్సరం నవంబరు 14 న బాలల దినోత్సవం జరుపుకుంటాము. భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం రోజున ఈ ఉత్సవం జరుగుతుంది. నెహ్రూకు పిలల్లలతో వున్న బాంధవ్యాన్ని తెలుపుతూ ఈ ఉత్సవం జరుపుకుంటారు.



సంస్కారం ఓ మస్తిష్క పవిత్రీకరణ ప్రక్రియ.  సంస్కారాన్ని అనుసరించి మానవుడు దైనందిన జీవితంలో అనేక సమస్యలకు పరిష్కారాలు కనుగొంటాడు. విద్య వల్ల, గురు ప్రబోధితంగా మరికొన్ని సంస్కారాలు అబ్బుతాయి. మనిషి ఆలోచనలకు పునాది అతడి గత జీవితపుఅనుభవాలే! వాటి ఆధారంగా మంచి, చెడు సంస్కారాలు రూపు  దిద్దుకుంటాయి. మనిషి ప్రవర్తన తీరును అతడి సంస్కార
పర్యవసానంగా చెప్పాలి. విపరీత పరిస్థితుల్లో మనసు కకావికలం  అవుతుంది. ఒక వ్యక్తి కోపం, మంచితనం, చెడ్డతనం, కారుణ్యం,  దాన గుణం, జీవితాన్ని యథాతథంగా స్వీకరించగల మనస్తత్వం, ధర్మ శాస్త్ర సారం ఒంటపట్టే చురుకుదనం, ఉద్విగ్న భరిత క్షణాల్లో ప్రవర్తన... అన్ని సన్నివేశాల్లోనూ సంస్కారాన్ని అనుసరించే నడవడి ఉంటుంది. మానవుడు జాతి, కుల, మత, లింగ, వర్ణ, ధనిక, పేద, వర్గ భేదాలకు అతీతంగా ఆచరించవలసిన ఉత్తమ సంస్కారం మరొకటి ఉంది. అదే సౌశీల్యం!

సంస్కారం అనేసరికి షోడశ (16) సంస్కారాలు జ్ఞప్తికి వస్తాయి. సనాతన ధర్మం ఆచరించే వారికి అవి వేదాలు నిర్దేశించిన కర్మలు. సంస్కారాన్ని సంప్రదాయం అనుసరిస్తుంది.
పై సంస్కారాలు ప్రతి సనాతన ధర్మాచరణుడికీ అనువర్తించేవి; 
మానవుడు జాతి, కుల, మత, లింగ, వర్ణ, ధనిక, పేద, వర్గ భేదాలకు అతీతంగా ఆచరించవలసిన ఉత్తమ సంస్కారం మరొకటి ఉంది. అదే సౌశీల్యం!
మానవుడు చేసే కర్మలు ముఖ్యంగా త్రివిధంగా ఉంటాయి. అవి దైవ ప్రీతి కోసం చేసేవి, పాప భీతితో చేసేవి, సంఘనీతిగా చేసేవి. సమాజ ఆమోదం కోసం మానవుడు మొదట సౌశీల్యం పెంపొందించుకోవాలి. సంఘ నీతిగా చెసేవి. సమాజ ఆమోదం కోనం మానవుడు మొదట సౌశీల్యం పెంపొందించుకోవాలి.

సద్గుణ సంపత్తిని పెంపు చేసుకొనే సంస్కారం బాల్య దశ నుంచి బాల బాలికలకు అంది వచ్చే నాగరిక లక్షణం. అదే వినయ సౌశీల్య సంపద. విద్య వల్ల వినయం సిద్ధిస్తుందని భగవద్గీత చెబుతుంది.
మాటలో నిదానం, గౌరవం ఇచ్చిపుచ్చుకొనే స్వభావం, తన మాటలు, చేతలతో ఎవరినీ నొప్పించని సున్నిత మనస్తత్వం, పిరికితనం లేని మృదు గంభీర స్వభావం, సత్యాన్ని, ధర్మాన్ని ఆచరించే సహృదయం, తోటి మనిషికి, కాలానికి, ప్రకృతికి విలువ ఇచ్చే సుజ్ఞానం... ఈ లక్షణాలు అన్నీ పరిపూర్ణంగా శ్రీరామచంద్రుడు సంతరించుకున్నాడని, ఆయనను మర్యాదా పురుషోత్తముడిగా కీర్తించిన మహా కావ్యం శ్రీమద్రామాయణం చెబుతుంది.
ఆధునిక కాలంలో ధనం, విద్య, హోదా ఉన్న వ్యక్తులు తమ కంటే తక్కువ స్థాయి గల వారిని చులకనగా చూడటం, మాటలో పలుకులో మోటుదనం ప్రదర్శించడం ప్రబలింది. ధనం, యౌవనం, విద్య, సౌందర్యం మానవుడిలో గర్వాన్ని కలిగిస్తాయంటారు. అణకువ కలిగి ఉన్నవాడే గొప్పవాడని సనాతన సంప్రదాయం స్పష్టం చేసింది.

మితస్మిత భాషణం వల్ల గొప్ప పనులు విజయవంతంగా చేయగల సామర్థ్యం సిద్ధిస్తుంది. వాచాలత్వంతో ఏ వ్యక్తి విజేత కాలేడు. భీరుత్వం లేని మంచితనాన్ని మనిషి అభ్యసించవచ్చు అందుకు సహనం తోడ్పడుతుంది. అన్ని కార్యాలూ సాధనతో సఫలీకృతం అవుతాయంటాడు శతకకారుడు. మానవుడిగా జన్మించినవాడు ప్రదర్శించగల ఉత్తమ సంస్కారం మానవత్వం. ఆ దిశగా ప్రయాణం పారమార్థిక విజయానికి నాంది!

No comments:

Post a Comment

ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు