
ఆదం అడుగు పెట్టిన చోట
రక్తం ఏరులై పారుతోందిరా
అహింస ప్రతి ధ్వనించిన చోట
హింసా ప్రవుత్తి ప్రబలుతుందిరా
మమతల మందారాలు పూచిన చోట
మారణ హోమం రగులుతోందిరా
గాంధీ మహాత్ముడు పుట్టిన చోట
గాడ్సే రాజ్యం సగుతోందిరా
ఒకనాటి మన పుణ్య భూమి
పాప భూమిగా మరుతోందిరా
కాళః నాగుల కరాళ నృత్యం
కర్మ భూమిని కాటు వేస్తోందిరా
పైశాచిక దాడులతో సాతాను చేష్టలతో
రాజ్యం ఆస్తి పంజరాలకు ఆలయమవుతోందిరా
కొంపలు కూల్చే మంచిని సమాధి చేసే
ముష్కరుల్తో తమస్సు తాన్దవిస్తోందిరా
చరిత్రకందని కాలం నుంచి
భారతీయులం మనమందరం
ఒకటిగా నడచి ఒకటిగా నిలిచి
శాంతి సామరస్యాలు స్థాపిద్దాం
నవ సమాజాన్ని నెలకొల్పుదాం
No comments:
Post a Comment
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు