Saturday, May 14, 2022

మనసును వెలిగించే దీపం నమాజు


అల్లాహ్ ను ఖురాన్ మరియు హదీసుల్లో పేర్కొనబడిన  ఏ  పవిత్ర పేరు పెట్టయినా పిలవచ్చు. సృష్టికర్త, కరుణామయుడు, పాలకుడు, పోషలుడు, విశ్వ కార్య నిర్వాహణా కర్త...  ఏ పేరు పెట్టి పిలిచినా ఒకటి మాత్రం నిజం. ఈ సృష్టి వెనకాల అనంతమైన శక్తి ఉంది. ఈ భూమ్మీద కోట్ల జంతువులు ఉన్నాయి.  మరియు కొన్ని బిలియన్ల మనుషులు ఉన్నారు. ఇంతమందిలో ఎవరికి వారు ప్రత్యేకంగా ఉండడం ఎలా సాధ్యమైంది ? దేవుడు మాత్రమే అది చేయగలడు. అనంతమైన సృజనాత్మకతకి దైవం మూలం. మనం రోజు సార్లు అల్లాహ్ ను ఆరాధిస్తే  ఓ అనిర్వచనీయమైన  అనంతమైన శక్తి మనంలో చోటు చేసుకుంటుంది. . మనకు  రోజు ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కోవడానికి కొత్త ఆలోచనలు వస్తాయి. మన ప్రార్థనలు పరిష్కారాలు ఇస్తాయి.



ఈనాడు సమాజంలో భక్తి పాత్ర తరిగి భుక్తి పాత్ర పెరిగింది. ప్రతి పని వెనుక, ప్రతి మాట వెనుక, ఏదో ఒక ప్రాపంచిక ప్రయోజనం ఉంటుందని, ఉండాలని ఆశించే వారికి నమాజు మహిమ అర్ధం కాదు. అలాంటి వారికి వారి చిత్తశుద్ధి లేని ప్రార్ధనల వల్ల మోక్షం కూడా లభించదు. ప్రార్ధన అంటే రుకూ, సజ్దాలా వంటి వివిధ భంగిమలు  మాత్రమే కాదు. ఎందుకంటే ? అజ్ఞానం, అహంభావాల వల్ల మూసుకుపోయున అంతశ్చక్షువుల్ని తెరిపించడమే ప్రార్ధన ధర్మం. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 
“ వారి ముందు కరుణామయుని సూక్తులు పఠిస్తుంటే వారు కన్నీటి ధారలతో సాష్టాంగ పడుతుండేవారు. ఆ తరువాత అనర్హులు, అయోగ్యులు వారికి వారసులయ్యారు. వారు నమాజుని వదిలేసి మనోవాంఛలకు బానిసలైపోయారు." (విద్యుఖుర్ఆన్ 19:58,59)

 “మరికొందరు మా సూక్తులు విన్పించి హితోపదేశం చేయగానే సజ్జా చేస్తారు." (వికుర్ఆన్ 3215) 

(కరుణామయుని నిజ భక్తులు) అసత్యానికి ఎన్నడూ సాక్షులుగా ఉండరు. ఎప్పుడైనా వారు పనికిమాలిన విషయం మీదుగా పోవలసివస్తే దాన్ని పట్టించుకోకుండా హుందాగా, గౌరవప్రదంగా దాటి వెళ్తారు. వారికి వారి ప్రభువు సూక్తులు విన్పించి హితోపదేశం చేయడం జరిగితే వారు అంధులుగా, బధిరులుగా వాటిపై పడిపోరు. (దివ్య ఖుర్ఆన్ 23: 79)

అల్లాహ్ పవిత్ర నామాల్లో అలీమ్, ఆలిమ్, అల్లామ్ అనే నామాలు కూడా ఉన్నాయి. అంటే జ్ఞానానికి మూలం అల్లాహ్ అని అర్థం. ఎంతటి ఉద్దండ పండితుడైనా తనకు తెలిసిన విషయాన్ని సౌమ్యంగా తెలియజేసి, ఎంతో  వినయంగా  చివర్లో వల్లాహు అఅలము బిస్సవాబ్ (అల్లాహ్ కు మాత్రమే వాస్తవ జ్ఞానం ఉంది) అని చెప్పటం ఆనవాయితీ. మన శరీరంలో ఎన్నో పనులు వాటికవే జరుగుతాయి. మన శరీరంలోనే కాదు, ఈ ప్రకృతిలో ప్రతిదీ అల్లాహ్ ఆనతో దానికి అదే జరుగుతుంది. చీమల్లో, చెట్లలో, కీటకాలలో, జంతువుల్లో మరియు మనుషుల్లో విజ్ఞానాన్ని మనం చూస్తాం. మన శరీరానికి, ఆ చీమలకి ఎవరూ ఈ జ్ఞానాన్ని నేర్పలేదు. ఈ జ్ఞానానికి మూలం దైవం. మనం ప్రార్థన చేస్తే అల్లాహ్  యొక్క జ్ఞానకృపలతో అనుసంధానమయ్యి మనలోకి మరింత జ్ఞానాన్ని వచ్చేలా చేస్తుంది. మనం ఆరాధన ద్వారా   అల్లాహ్ కు దగ్గర  అయినప్పుడు గొప్ప ఆలోచనలు,  భావాలు,  మంచి  మాటలు మన జీవితాన్ని ప్రభావంతంగా మలచడమే కాక  ఈ ప్రపంచం మీద గొప్ప  సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి.

“తమ ప్రభువును స్తుతిస్తూ ఆయన్ని స్మరిస్తారు. ఆహంకారంతో విర్రవీగరు. వారు రాత్రిళ్ళు బాగా మేల్కొని దైవారాధనలో గడుపుతారు. ఆశతో, భయంతో తమ ప్రభువును వేడుకుంటారు." (కలం 92 100 ఒక మనిషి నమాజుని తెలిసో తెలియకో సక్రమంగా చేయకపోతే.... ఏమిటి? ఇలాగేనా నమాజు చేసేది? అని కసురుకోకండి. నమాజు ముగిసాక పక్కన తీసుకెళ్ళి చక్కగా విడమరచి చెప్పండి. ఒకసారి ఒక గిరిజన వ్యక్తి దైవప్రవక్త(స) దగ్గరకు వచ్చాడు. ఆ సమయంలో ఆయన మస్జిద్లో కూర్చుని ఉన్నారు. ఆ వ్యక్తికి మూత్రం వచ్చింది. మస్జిద్ మర్యాదలు పాపం అతనికి తెలియవు. అక్కడే నిలబడి మూత్రం పోయసాగాడు. అతన్ని దండించే ఉద్దేశ్యంతో నలువైపుల నుంచి అక్కడున్న ప్రవక్తగారి సహచరులు చుట్టుముట్టారు. ఈ దృశ్యాన్ని గమనిస్తున్న ప్రవక్త(స), "అతన్ని మధ్యలో ఆపకండి. ఒక దోలు నీరు తెచ్చి పోయండి. అల్లాహ్ మిమ్మల్ని ఉనికిలోకి తీసుకు వచ్చింది. సౌలభ్యాల కోసమేగాని సంకట స్థితిని సృష్టించడానికి కాదు సుమా!" అని మందలించారు.(బుఖారీ)

 మనందరికీ చుట్టూ ఒక చట్రం  ఉంటుంది. ఆ చట్రంలో  ఆలోచనలు, ఎమోషన్స్   మరియు శక్తి నిండి ఉంటుంది. మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చేసినప్పుడు ఆ చట్రం శుభ్రపడుతుంది.  దృఢంగా మారుతుంది. అలాంటి చట్రం మనకు ఎన్నో లాభాలు చేకూర్చుతుంది.  ఆలోచనలో స్పష్టత వస్తుంది.  మానసిక ప్రశాంతతను రోగనిరోధకశక్తిని సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని ఇస్తుంది. దీనికిగాను మనం అల్లాహ్ ను ఆరాధించేటప్పుడు ఆశ,భయం, ప్రేమ  మదినిండా గూడు కట్టుకోవాలి. ఇదే విషయాన్ని ఖురాన్ ఇలా అంటుంది; విశ్వాసులారా! మీరు గనక భయభక్తుల వైఖరి అవలంబిస్తే అల్లాహ్  మీకు మంచీ చెడుల విచక్షణాజ్ఞానం ప్రసాదిస్తాడు; మీలో ఉన్న చెడుగులు తొలగిస్తాడు; మీ తప్పులు మన్నిస్తాడు. అల్లాహ్  అపార దయామయుడు. (అన్ఫాల్ - 29)

ఓ మనిషి తాగుడికి అలవాటుపడి, లేదా ఇతర వ్యసనాలకి బానిసై జీవించాడు. తరువాత పశ్చాత్తాపం చెంది మస్జిద్ కు వస్తే అతని ఈ భయం భక్తీ ఎన్నాళ్ళు ఉంటుందనీ? ఇది ఉడతా భక్తి లాంటిదేనని వెక్కిరించకండి. అతనిలో వచ్చిన ఆ మార్పుకి అతన్ని అభినందించండి. మరింత మంచిగా మారేందుకు దోహదపడే ప్రోత్సాహాన్నివ్వండి.
"ఇక్రమా'నే తీసుకోండి. ఇతను ఇస్లాం మరియు ముస్లిములకు బద్ద విరోధి. దైవ విరోధి అయిన అబూజహల్ కుమారుడు. ముస్లింగా మారక పూర్వం తన తండ్రిలానే దైవప్రవక్త(స) ను అదేపనిగా వేధిస్తుండేవారు. మక్కా విజయం అనంతరం దైవప్రవక్త(స)కు భయపడి మక్కా నుండి యమను పారిపోయాడు. అప్పటికే ఇస్లాం స్వీకరించిన అతని భార్య యమన్ వెళ్ళి దైవ ప్రవక్త(స) గారి మన్నింపుల వైఖరిని గురించి వివరించింది. తన భర్త చేత ఇస్లాం స్వీకారం చేయించి దైవప్రవక్త(స) గారి సమక్షంలో తీసుకు వచ్చింది. దైవప్రవక్త(స) "ఇక్రమా" ను చూడగానే ఆనందంతో లేచి గబగబా అతని వైపుకు వెళ్ళారు. ఆ తొందరలో ఆయన(స) భుజంపైన కండువా సయితం జారి పోయింది. ఆ సమయంలో ఆయన నోట వెలువడిన మాటలివి! | " ఓ మరలి వచ్చిన వాడా! నీ రాక శుభప్రదమవుగాక! " (మిశ్కాత్) 

అవును! హృదయం లోపల పశ్చాత్తాప భావం ఏర్పడ్డాక అంత త్వరగా చెదిరిపోదు. కాకపోతే ఒక మనిషిలో ఉన్నది. స్వచ్ఛమైన విశ్వాసమా? లేదా పరిసరాల ప్రభావమా? లేక ప్రదర్శనా భావమా? అని సందేహం కలగవచ్చు. ఆరాధనను కేవలం ఓ ఆచరణా రీతిగా చూసే సమాజంలో ఇలాంటి అనుమానాలు రావటంలో ఆశ్చర్యం లేదు. అల్లాహ్ ఇలా అంటున్నాడు : " వారు ప్రార్ధన చేయడానికి లేస్తే వళ్ళు విరుచుకుంటూ చాలా బద్దకంతో లేస్తారు. దైవ మార్గంలో ఖర్చు పెట్టవలసి వస్తే ఏడ్పు ముఖంతో చాలా అయిష్టంగా ఖర్చు పెడతారు. "(దివ్య ఖుర్ఆన్ - 9:54) 
మానవునికి మేమేదైనా అనుగ్రహిస్తే అతను మాకు విముఖుడయి పోతాడు. పైగా అహంకారంతో విర్రవీగుతాడు. కాని అదే కష్టమొచ్చినప్పుడు సుదీర్ఘప్రార్థనలు చేస్తాడు. (ఫుస్సిలత్- 51) 

మనలో చాలామంది కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే అల్లాహ్ ను ఆరాధిస్తారు. దేవుడు అద్భుతాలు చేసి మన  కష్టాలని తొలగిస్తాడని అనుకుంటాము, సందేహం లేదు. కానీ మనం అర్థం చేసుకోవలసింది ఏమిటంటే అల్లాహ్  మనకు  ఆలోచన, శక్తి, జ్ఞానం ఇచ్చి మన సమస్యలను మనమే పరిష్కరించుకునేలా  చేస్తాడు. ఆలోచనలకు తగినట్టు ప్రవర్తించడం మన బాధ్యత. అల్లాహ్  మనకు  శరీరాన్ని ఆత్మను ఇచ్చాడు వాటి ద్వారా మనకు కావలసిన జీవితాన్ని మనం సృష్టించుకోవచ్చు. మనం బద్ధకంగా పడుకుని లేదా కాలయాపన చేస్తూ, లోకాన్ని, లోకుల తీరుని  చూస్తూ గడిపేస్తూ అల్లాహ్  వచ్చి మన  సమస్యలను తీర్చేస్తాడు అనుకోవడం పొరపాటు.  దేవుడు మనకు   అవకాశాలు మాత్రమే ఇస్తాడు. వాటి మీద పనిచేయడం  మన బాధ్యత.

కొన్నిసార్లు తెలియకుండానే మనం నెగిటివ్ ఆలోచనల్ని, ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొంటాం. మనం ప్రతి రోజూ అయిదు సార్లు అల్లాహ్ ను ఆరాధిస్తే  ఈ నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళి పోయేలా చేసి మనలో ఒక పాజిటివ్ ఎనర్జీని నింపుతాడు. కాబట్టి ప్రార్థన చేయడం అనేది ఆధ్యాత్మికంగా స్నానం చేయడం లాంటిది. ఇది మన ఆత్మని నూతన శక్తితో నింపి రోజు ఎదురయ్యే పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మనల్ని సిద్ధం చేస్తుంది. ఖురాన్ ఇలా అంటోంది; (సరే, మీకేవైనా ఇబ్బందులుంటే) సహనం, ప్రార్థనల ద్వారా (నా) సహాయాన్ని అర్థించండి. ప్రార్థన (నమాజ్‌) కాస్త కష్టమైన పనే, సందేహం లేదు. కాని ఒకరోజు తమ ప్రభువును కలుసుకోవలసిఉందని, ఆయన సన్నిధికే మరలిపోవలసి ఉందని భావించే దైవభీతిపరులకు మాత్రం ప్రార్థన (నమాజ్‌) చేయడం కష్టమేమీ కాదు. (బఖరః - 45-46)


కాని వీటన్నిటికీ అతీతంగా ఏర్పడే భక్తి భావన భాషకి అందదు. లోకం కళ్ళతో చూస్తే అది అర్ధం కాదు. ప్రాపంచిక విషయాలన్నిటికీ అతీతంగా అల్లాహ్ పట్ల ఏర్పడే భక్తి ఓ నిరంతర ధ్యానం.

" విశ్వాసులు తప్పకుండా కృతార్థులవుతారు. వారు తమ నమాజులో ఎంతో అణకువ, నమ్రతలు పాటిస్తారు. పనికి మాలిన విషయాలకు చాలా దూరంగా ఉంటారు. తమ సంపద నుండి జకాత్ (పేదల ఆర్ధిక హక్కు, చెల్లిస్తారు...వారు తమ అప్పగింతలు, ప్రమాణాలు, ఒప్పందాల విషయంలో నిజాయితీగా వ్యవహరిస్తారు. తమ నమాజులను క్రమం తప్పకుండా, నియమబద్ధంగా పాటిస్తారు.
అలాంటి వారే మహోన్నత స్వర్గానికి వారసులవుతారు. వారక్కడ కలకాలం (హాయిగా) వుంటారు. (దివ్యఖుర్ఆన్ 23: 10-11)
ఇలాంటి ధ్యాన స్థితిలో మనం ఉన్నామా? ఉంటే గనక మన జీవితం ధన్యం 




Friday, May 13, 2022

సాధన చేయుము నరుడా! సాధ్యం కానిది లేదురా!!

సాధన చేయుము నరుడా! సాధ్యం కానిది లేదురా!!

అది ఓ పెద్ద మైదానం.... ఈ రోజు జనకోలాహలంతో నిండి వుంది.... ఏమిటి... విశేషం... అని ఆలోచిస్తున్నారా...! విలు విద్యపోటీలు నిర్వహించబడుతున్నాయి.... పోటీ కాసేపట్లో ఆరంభం కానున్నది...!! విలు విద్యలో ఆరితేరిన వీరులు హాజరై ఉన్నారు. దూరాన ఐదు లక్ష్యాలు కనిపిస్తున్నాయి. వీరుల దృష్టి మొత్తం వాటి పైనే ఉంది. పోటీ ఆరంభమయ్యింది.




ఓ వ్యక్తి వచ్చాడు... విల్లుని చేతిలో పట్టు కున్నాడు... బాణం అమర్చాడు.... గురి పెట్టాడు...
బాణం విసిరాడు....... కాని గురి తప్పాడు. రెండో వ్యక్తి వచ్చాడు..... ప్రయత్నిం చాడు.....! వైఫల్యం చెందాడు. మూడో వ్యక్తి వచ్చాడు....... మీసాలు మెలేసాడు...... తాడ కొట్టాడు... కండలు చూపించాడు.....! చతికిలా పడ్డాడు. అలా ఒకరి తరువాత ఇంకొకరు వస్తున్నారు. కానీ ఏ ఒక్కరూ ఒకే ఒక్క లక్ష్యాన్ని కూడా సరిగా గురి పెట్టి కొట్టలేక పోతున్నారు. ఇది చూస్తున్న ప్రేక్షకుల్లో సైతం అసహనం చోటుచేసుకుంది. వారందరూ విసుగెత్తారు..... గురి పెట్టి కొట్టగలిగే సమ రుడు ఇంతమందిలో ఒక్కడు కూడా లేదా...? అని వాపోతున్నారు. అప్పుడు అక్కడ ఓ అద్భుత సంఘటన జరిగింది...... ప్రజలం దరూ దిగ్ర్భాంతి చెందారు........? ఒకడు లేచాడు...... విల్లు వద్దకు చేరు కున్నాడు..... విల్లు చేతిలోకి తీసుకున్నాడు....... లక్ష్యం ఎటువైపు వుందో చెప్పమన్నాడు... ఆ దిశకు తిరిగి నిలబడ్డాడు.....! ఏమిటి అన్ని అడగడమేనా...? అతనికి కనిపించదా..... అని మీరు ప్రశ్నించవచ్చు. అవును అతను కళ్ళు లేని ఓ కబోది, చూడలేడు పాపం. ఏ వస్తువునైనా కేవలం విని గ్రహించగలడు, లేదా స్పర్శ వల్ల తెలుసుకోగలడు. ఇప్పటికీ మీకు అర్థమయ్యివుంటుంది. ప్రేక్షకులు ఎందుకు దిగ్ర్భాంతికి గురయ్యారో...! వచ్చిన ఆ వ్యక్తి విల్లుపై బాణాన్ని పెట్టాడు..... వెనక్కి లాగాడు..... కాసేపు ఆగాడు. ఇటు ఆ దృశ్యాన్ని తిలకించే ప్రేక్షకుల గుండెలు ఆగిపోయేంత పని జరిగింది. వారంతా మౌన మూర్తులై శిలల్లా నిలిచివున్నారు. చూసే శక్తి, బాణం విసిరే నైపుణ్యం ఉన్న గొప్పగొప్ప వ్యక్తులు సాధించలేని ఈ లక్ష్యాలను ఓ కళ్ళు లేని కబోది ఛేదించగలడా? ఇది సంభవ
మేనా...! అతను గురి ఎరిగి బాణాన్ని విసి -రాడు...! ఏమయ్యింది..? బాణం . కరెక్టుగా లక్ష్యం మధ్యలో తగిలింది....! మైదానమంతా నిశ్శబ్దం..! తాము చూస్తున్నది కలా..! నిజమా...! అని వారికే అనుమానం కలుగు తోంది. వారు చూచినది వాస్తవం అని గ్రహిం -చిన మరుక్షణం.... మైదానమంతా చప్పట్లు,
ఈలల ధ్వనితో మారుమోగింది. అలా అతను ఒకటి తరువాత మరొకటంటూ ఐదు లక్ష్యా లను గురి పెట్టి కొట్టి తిరుగులేని విజేతగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు. ఏమిటి కథలు చెబుతున్నారా......? అని మీరు నన్ను నిలదీయవచ్చు. కానీ, నేను చెప్పింది అక్షరాల నిజం...! వాస్తవంగా జరిగిన సంఘటన.....! నమ్మబుద్ధి కలగటం లేదా...? అయితే రండి....! అలాంటిదే ఓ సజీవగాధను చదువుదాం.... అసంభవం ఎలా సంభవ మయ్యిందో తెలుసుకుందాం!

బాల్యం
 జలపాతములు, జలకములు, సరస్సులు, సుమ వనములు, జలజలపారే సెలయేరు, గలగల పారే నదితీరు, ప్రకృతి రమణీయం, సౌందర్యం, సింహగర్జనలు, సింధూర పవనములు, కోయిల రాగాలు, నెమలి నాట్యాలు, చూడటానికి వేయి కళ్ళు చాలవు. వేయి కళ్ళమాట అటుంచి, చూచి ఆనందించడానికి ఒక్క కన్ను కూడా లేని వాడతను. అతను ఏడు సంవత్సరాల బాలుడు....... ఇంటి బైట వీధిలో నుంచొని వున్నాడు. పిల్లల మాటల గలగలలు అతన్ని మైమరపిస్తున్నాయి. వారందరూ 'పట్టుకోండి చూద్దాం' ఆట ఆడుకుంటున్నారు. వారితో కలిసి తానూ ఆడాలని ఆ పసిహృదయం ఆరాటపడుతోంది. నేటి ఈ వింత ప్రేరణ అతన్ని గిలిగింతలు పెడుతూవుంది. అతనిలో ఎక్కడలేని ఉత్సాహం చోటు చేసుకుంది. ఒక్కసారిగా శబ్దం వస్తున్న వైపునకు పరుగెత్తాడు. ఆ బాలుడు.... కొన్ని క్షణాలు తను అంధుడన్న విషయం మరిచాడు....... కళ్ళు గట్టిగా మూసు కొని చేతులు చాచి నలువైపులా తిరుగుతూ ఏ ఒక్కరినైనా పట్టుకోవాలని ప్రయత్నిస్తు న్నాడు....! ఎవరూ దొరకడం లేదు!! కళ్ళు చెరిచి చూస్తే కనిపిస్తారేమోనని కళ్ళు తెరిచాడు. కాని అంతా చీకటిమయం ...! అప్పుడు అతనికి బోధపడింది తను గుడ్డివాడినని. తను కళ్ళు మూసుకున్నా తెరచినా... తనకు ఎదురయ్యేది చీకటేనని. అతని మనసంతా ముడుచుకు పోయింది. అతని ముఖం వాడిన పువ్వలా మారింది. దుఃఖ విషాన్ని దిగమ్రింగుతూ ఇంటివైపు తిరుగుముఖం పట్టాడు ఆ బాలుడు.

జ్ఞానోదయం ఇప్పుడు అతను యవ్వనస్తుడయ్యాడు. బాల్యం నుండి ఈనాటి వరకు తను కేవలం విని జీవించినవాడే గాని దేన్నీ చూసి ఎరుగడు. పెరిగిన వయస్సు అతన్ని ఓ కళాకారుణ్ణి చేసింది. వినే ప్రతి వస్తువుకి దాని వర్ణనలను బట్టి తన మనోఫలకంపై చిత్రాలు గీసుకునే వాడు. తియ్యటి కమనీయమైన కోయిల రాగాన్ని విన్న అతను ఈ స్వరంలా కోయిల కూడా బహు సుందరంగా వుంటుందను కొన్నాడు. అలాంటి కోయిల చిత్రమే అతని మదిలో చోటుచేసుకుంది. ఈ రోజు అతను ఓ వింత వార్త విన్నాడు. మక్కాలో ముహమ్మద్ అని పేరుగల ఓ వ్యక్తి కొత్త ధర్మాన్ని బోధిస్తు వాడట... మిథ్యాదైవాలను వదలి నిజదైవాన్ని ఆరాధించమంటున్నాడట... అనైతిక చర్యల్ని స్వస్తి పలికి, సభ్యత సంస్కారాలు అలవర్చు కోండని ఉపదేశి స్తున్నాడట...! అతను ఆలో చిస్తున్నాడు. ముహమ్మద్! ముహమ్మద్.....!! ఈ పేరు తను అనేకసార్లు విన్నాడు అని గుర్తుకు వచ్చింది. అవును బాల్యంనుండి ఆయన్ను ప్రజలు కీర్తిస్తూవుంటే తను విన్నాడు. ఆయన్ను ప్రజలు సాదిక్, అమీన్ అని ముద్దుగా పిల వడం కూడా తనకు గుర్తుంది. ఎవరూ తన్ను వచ్చి పరామర్శించకపోయినా ఆయన మాత్రం మరచి పోకుండా వచ్చి తన్ను పరామర్శించి, యోగక్షేమాలు అడిగి మరీ వెళ్ళేవారు. ఈరోజు స్వయంగా తనే వెళ్ళి ఆయన్ను కలుసుకోవా లని నిశ్చయించుకున్నాడు. ప్రవక్త(స)గారు ఎక్కడున్నారో అడిగి తెలుసుకున్నాడు. చివరికి ప్రవక్త(స)గారి దర్బారులో హాజరయ్యాడు. ప్రవక్త(స) తన సహచరులకు దైవం గురించి ధర్మం గురించి చెబుతున్నాడు. "పర్వతాలకూ, సముద్రాలకూ, ఆకాశాలకూ,
భూములకూ, సూర్యచంద్ర నక్షత్రాలకూ, సకల చరాచర సృష్టికి మూలం అల్లాహ్" అన్నారు. కాని అతనికి బోధపడలేదు.... ఎందు కంటే? తను ఎన్నడూ పై పేర్కొన్న ప్రకృతి మమయాన్ని కళ్ళతో చూడలేదు. అవి ఎలా ఉంటాయో కూడా తనకి తెలియదు" అప్పుడు ప్రవక్త(స) ఇలా అన్నారు. అల్లాహ్ యే మనం దరికి మాట్లాడేశక్తి నిచ్చింది, ఆయనే మనకు చేతులు, కాళ్ళు ప్రసాదించింది. ఆయనే మనకు వినే శక్తిని అనుగ్రహించింది. ఆయనే మనకు ప్రాణం పోసింది. ఇప్పుడు అతనికి అర్థమయింది. తమ అక్కడున్న ఓ వ్యక్తికి “అల్లాహ్ ఎలా వుంటాడని' ప్రశ్నించాడు. అల్లాహ్ కు భౌతిక ఆకారం లేదని, భౌతిక నేత్ర ములతో ఆయన్ను చూడలేరని సమాధానం లభించింది. అంటే చూసే శక్తి వున్నవారికి కూడా ఆయన్ను చూసే భాగ్యం లేదన్నమాట. ఇక నాకు కళ్ళు లేవన్న బాధకూడా పోయింది. అని లోలోన మురిసిపోతున్నాడు ఆ అంధుడు. ప్రవక్త గారి మాటలతో అతని ఆలోచనలకు అంతరాయం కలిగింది.

ప్రవక్త (స) ఇలా అన్నారు. “అల్లాహ్ దగ్గర ఆమోదిత ధర్మం ఇస్లాం మాత్రమే. (దివ్యఖుర్ఆన్: 3:19) ఎవరు దైవవిధేయతా మార్గం ఇస్లాం కాదని ఇతర జీవిత విధానాలను (శాంతికి, స్వయం సమర్పణకి వ్యతిరేక ధోరణుల్ని) అవలంభించ గోరుతారో వాటిని ఎన్నటికీ ఆమోదించడం జరగదు (దివ్యఖుర్ఆన్: 3:85) అన్న దైవ వచనాలు స్వయంగా ప్రవక్తశ్రీ(స) గారి నోట విన్న తక్షణమే.... తన చూపుడు వ్రేలును, ఏ వ్రేలునైతే తను జీవితంలో ఒక్కసారి కూడా చూడలేదో, ఆకాశం వైపు ఎత్తిచూపుతూ అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అప్పదు అన్న ముహమ్మదుర్రసూలుల్లాహ్' అంటూ తన్నుతాను అల్లాహ్ కు ఆయన ప్రవక్త(స) గారికి సమర్పించుకున్నాడు. ఏమిటి ఆశ్చర్యపడుతున్నారా! కళ్ళున్న వేలాది మంది విద్యావంతులైన వందలాదిమంది, వాణిజ్య బృందాలను నడిపే అనేకమంది, కండబలాం- గుండెబలం, మంది మార్బలం  వున్న ఇంతమంది గ్రహించలేని సత్యాన్ని, ఛేదించలేని లక్ష్యాన్ని ఓ గుడ్డివాడు గ్రహించడమా...! ఓ చూసేశక్తి లేని దౌర్భాగ్యుడు ఛేదించడమా...!! అవును... అతను గ్రహించాడు. తను గ్రహించేలా స్వయంగా అతని ప్రభువే నిర్ణయించాడు. అతని ప్రవర్తన ఆ సర్వేశ్వరుడికి నచ్చింది". అల్లాహ్ ఇలా తెలియజేస్తున్నాడు. “ఏ వ్యక్తి హృదయాన్ని అల్లాహ్ ఇస్లామ్ కై తెరిచాడో అతను తన ప్రభువునుండి లభించిన కాంతి మార్గంలో నడుస్తాడు" (దివ్యఖుర్ఆన్: 39:22)

ఈ పై వచనంలో అల్లాహ్ ఇస్లాంపై మనిషి హృదయకవాటాలను తెరుస్తాడని పేర్కొనడం జరిగింది. అంతేకాని కనురెప్ప లను తెరుస్తాడని పేర్కొనబడలేదు. దివ్య కాంతితో కొంతిమయమైవున్న అతని హృదయంతో, తను సత్యజ్యోతిని గ్రహించ గలిగాడు. మీరు అతన్ని ప్రకృతి సౌందర్యాన్ని తనివితీరా ఆస్వాదించలేని ఓ దౌర్భాగ్యు డన్నారు. కాదు. వాస్తవ దృక్పథంతో గనక గ్రహించినట్లయితే ప్రపంచ మంతటిలో - అతనకి మించిన సౌభాగ్యవంతుడు ఈనాడు -. మరొకడు లేడు. నేడు అతని హృదయం అనందంతో సంతోషంతో పొంగిపొర్లుతోంది. అమందానంద కందళిత హృదయారవిందుడై అతని ముఖం కోటి కాంతులీనుతోంది.  ఇక దౌర్భాగ్యుడెవరని అంటారా.... చూడగలిగే వశక్తి... చేయగలిగే బలం ఉన్నా, సత్యస్వీకారం నుండి తన హృదయచక్షువులను మూసుకున్న వారు. వీరికి కళ్ళున్నాయి. కా ని  సత్యాన్ని గ్రహించే హృదయం కరువైయ్యింది.

 “అల్లాహ్ హితబోధతో మరింత కఠిన హృదయులై పోయిన వారికే కీడు మూడి వుంది. వారే ఈ ప్రపంచమంతటిలోనూ అత్యంత చెడ్డ  దౌర్భాగ్యులు. (దివ్యఖుర్ఆన్: 39:22)

ఇంకా తను సాధించిన లక్ష్యాలేమిటో ఒక్కొక్కటిగా తేలుకుందాం! తన స్థాయి ఏమిటో మన స్థాయి ఏమిటో బేరీజు వేసుకుందాం!!
(సశేషం)