Saturday, January 30, 2016

islam,iman,ihsan



ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు

karunya prabhuvu allah



ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు

Tuesday, January 19, 2016

safar e akhirat - 2



ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు

ఇస్లాంలో పరిశుభ్రత


ఇస్లాంలో పరిశుభ్రత - النظافة من الإسلام
حَدَّثَنَا مُحَمَّدُ بْنُ الْمُثَنَّى وَ مُحمَّدُ بْنُ بَشَّارٍ وَ إِبْرَاهِيمُ بْنُ دِينَارٍ جَمِيعاً عَنْ يَحْيَىٰ بْنِ حَمَّادٍ . قَالَ ابْنُ الْمُثَنَّى : حَدَّثَنِي يَحْيَىٰ بْنُ حَمَّادٍ . أَخْبَرَنَا شُعْبَةُ عَنْ أَبَانُ بْنِ تَغْلِبَ عَنْ فُضَيْلٍ الْفُقَيْمِيِّ عَنْ إِبْرَاهِيمَ النَّخَعِيِّ عَنْ عَلْقَمَةَ عَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُودٍ ، عَنِ النَّبِيِّ قَالَ: لاَ يَدْخُلُ الْجَنَّةَ مَنْ كَانَ فِي قَلْبِهِ مِثْقَالُ ذَرَّةٍ مِنْ كِبْرٍ. قَالَ رَجُلٌ: إِنَّ الرَّجُلَ يُحِبُّ أَنْ يَكُونَ ثَوْبُهُ حَسَناً، وَنَعْلُهُ حَسَنَةً. قَالَ: إِنَّ اللَّهَ جَمِيلٌ يُحِبُّ الْجَمَالَ.اَلْكِبْرُ: بَطَرُ الْحَقِّ وَغَمْطُ النَّاسِرواة صحيح مسلم
అల్ మతన్ (బోధించిన అసలు విషయం) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించినారు ఎవరి హృదయములో నైతే అణువంత అహంభావం (గర్వం) ఉంటుందో అతడు స్వర్గంలో ప్రవేశించలేడు. అప్పుడు ఒక వ్యక్తి ఇలా ప్రశ్నించాడు, (అప్పుడు అక్కడ ఉన్న) ఒక వ్యక్తి ఇలా ప్రశ్నించాడు మరి మానవుడు నిశ్చయంగా మంచి దుస్తులు ధరించాలని, మరియు మంచి పాదరక్షలు (చెప్పులు,బూట్లు) తొడగాలని ఇష్టపడతాడు కదా!” ప్రవక్త ఇలా స్పష్టం చేశారు, ఖచ్చితంగా అల్లాహ్ సౌందర్యవంతుడు మరియు సౌందర్యాన్ని ఇష్టపడతాడు. అహంభావం (గర్వం) అంటే ఏమిటంటే వాస్తవాన్ని తిరస్కరించడము మరియు ప్రజలను నీచంగా (హీనంగా) భావించడము. సహీ ముస్లిం హదీథ్ గ్రంధం.
హదీథ్ వివరణ
ఈ హదీథ్ పరిశుభ్రతను ప్రోత్సహిస్తుంది మరియు దురహంకారాన్ని, గర్వాన్ని నిరోధిస్తున్నది. హృదయంలో అణువంత అహంకారం (గర్వం) ఉన్నా సరే అతడు స్వర్గం లోనికి ప్రవేశించలేడు. ఒకవేళ అదే అహంకారం అతడిని అల్లాహ్ యొక్క ఉనికిని మరియు అల్లాహ్ యొక్క దివ్యవాణిని తిరస్కరించేటట్లు చేస్తే, అతడు తప్పక నరకాగ్నిలోనికి విసిరి వేయబడతాడు. దివ్యసందేశం గురించి అయిష్టం చూపటం, ఇంకా ఐశ్వర్యం, భౌతిక సౌందర్యం, సామాజిక మరియు ప్రాపంచిక ఔన్నత్యం మరియు పేరుప్రఖ్యాతులున్న వంశమని గర్వపడటం మొదలైనవి అతడిలో గర్వాన్ని, దురహంకారాన్ని పెంచి, ఇతరులను తక్కువగా, నీచంగా చూడటం వైపుకు మళ్ళిస్తుంది. తర్వాత తర్వాత వీటి వలన దివ్యసందేశాన్ని కూడా తిరస్కరించటం మొదలు పెడతాడు. మొదట అతడు నరకశిక్ష అనుభవిస్తాడు, అతడు ముస్లిం అవటం వలన ఆ తర్వాత స్వర్గంలోనికి చేర్చబడతాడు. ఏదేమైనా గాని చక్కని మంచి దుస్తులు అహంకారానికి, గర్వానికి చిహ్నం కాజాలదు. ఇంకా ఇస్లాం పరిశుభ్రంగా, హుందాగా ఉండటాన్ని ప్రోత్సహిస్తుంది.
ఈ హదీథ్ ఉల్లేఖకుని పరిచయం: అబు అబ్దుర్రహ్మాన్ అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రదియల్లాహు అన్హు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దైవసందేశాన్ని ప్రాంరంభంలోనే స్వీకరించిన ప్రముఖులలో ఒకరు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి సల్లం నుండి ఖుర్ఆన్ లోని 70 అధ్యాయములు (సూరహ్ లు) కంఠస్థం చేసినారు. 32 హిజ్రీ సంవత్సరంలో దాదాపు 70 సంవత్సరాల వయస్సులో మదీనా పట్టణంలో చనిపోయారు.
ఈ హదీథ్ యొక్క ప్రయోజనాలు (లాభాలు):
1- అహంకారం మరియు ప్రజలను నిర్లక్ష్యం చెయ్యటం నిషేధించబడినది.
2- పరిశుభ్రత అంటే ప్రతి దానికీ సంబంధించనది - ధరించే దుస్తులు, వాడే ఇతర వస్తువులతో సహా.
3- ఇంటిని, పాఠశాలను, వీధులను పరిశుభ్రంగా ఉంచటం పై జాగ్రత్త వహించవలెను.
4- వారానికి కనీసం ఒక్కసారైనా స్నానం చేయటం మెచ్చుకో దగిన విషయం.
ప్రశ్నలు
1. ఈ హదీథ్ నుండి మీరు నేర్చుకున్న విషయాలు క్లుప్తంగా వ్రాయండి.
2. ఈ హదీథ్ ఉల్లేఖకుడి గురించి వ్రాయండి.
3. అహంకారం వలన కలిగే నష్టాల గురించి వ్రాయండి.

అంటు వ్యాధుల గురించి ఇస్లామీయ షరీయత్‌ ఏమంటోంది?


- అల్లామా ఇబ్ను బాజ్ (ర)
ప్రశ్న:- అంటు వ్యాధుల గురించి ఇస్లామీయ షరీయత్‌ ఏమంటోంది?
జవాబు:- వ్యాధుల్లో రెండు రకాలున్నాయి. ఒకటి:- వ్యాధిగ్రస్త్తుణ్ణి మాత్రమే బాధించేవి. రెండు:- వ్యాధిగ్రస్తునితోపాటు చుట్టప్రక్కల ఉన్నవారికి సైతం సొకేవి. ఇలాంటి అంటు వ్యాధుల్లో కూడా కొన్ని తేలికపాటివి, మరికొన్ని తీవ్రమైనవి ఉంటాయి. తేలికపాటి అంటువ్యాధుల విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. భయంకరమైన అంటువ్యాధలకు ఆమడ దూరాన ఉండటమే మంచిది. ఒకసారి దైవప్రవక్త (స) కుష్టు వ్యాధి సోకిన వ్యక్తితో కలిసి భోజనం చేశారు. అదేమంటే ”అల్లాహ్‌ాపై నమ్మకంకొద్దీ అలా చేశాన”న్నారు. (ఫత్‌హుల్‌ బారీ). మరికొన్ని ఉల్లేఖనాలు దీనికి భిన్నంగా ఉన్నాయి. ”కుష్టు రోగి నుండి పులి మాదిరిగా పారిపోండి” (బుఖారీ)అని ఒక ఉల్లేఖనం ఉంది. ”రోగిష్టులైన ఒంటెలను ఆరోగ్యవంతమైన  ఒంటెల మందలోకి తోలకండి” (బుఖారీ, ముస్లిం) అనే హదీసు కూడా ఈ సందర్భంగా గమనార్హమే.
హజ్రత్‌ సాద్‌, హజ్రత్‌ అబ్దుర్రహ్మాన్‌ బిన్‌ ఔఫ్‌ (ర)ల కథనం ప్రకారం మహనీయ ముహమ్మద్‌ (స) ఒకసారి ఇలా అన్నారు: ”ఏదైనా ఒక ప్రదేశంలో ప్లేగు వ్యాధి ప్రబలినట్లు తెలిస్తే అక్కడకు వెళ్ళకండి. ఒకవేళ మీ స్థిర నివాసంలోనే గనక ఈ వ్యాధి ప్రబలినట్లయితే మీరు సైతం బయటికి వెళ్ళకండి”. (బుఖారీ)
ఈ రెండురకాల ఉల్లేఖనాలను సమన్వయపరుస్తూ హాఫిజ్‌ ఇబ్నె హజర్‌ (ర) పండితుల ప్రవచనాలను క్రోడీకరించారు. పూర్వం అజ్ఞానకాలంలో జనులు వ్యాధుల గురించి ఎన్నో భయాందోళనలకు గురయ్యేవారు. వ్యాధులు స్వతహాగా అంటు స్వభావం కలవని, చాలా సులభంగా అవి ప్రజల్లో వ్యాపిస్తాయని ఇందులో దైవ శక్తికి, దైవ ప్రమేయానికి తావు లేదని నమ్మేవారు. ఇది సరైనది కాదు. ఏ ఉల్లేఖనాల ద్వారా అయితే ‘అంటు’ సోకుతుందని నిర్ధారణ అయిందో అవి సయితం దైవ ప్రణాళికకు లోబడి ఉన్నాయి. హాఫిజ్‌ ఇబ్నె హజర్‌ (ర) గారి వివరణను బట్టి అత్యధిక మంది విద్వాంసుల అభిమతం ఇదేనని రూఢీ అవుతోంది. (ఫత్‌హుల్‌ బారీ)
అయితే నేటి  వైజ్ఞానిక యుగంలోనూ అంటు వ్యాధులు కేవలం ఊహలకే పరిమితం కాలేదు. అనుదినం అవి తమ ప్రతాపాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాయి. దైవం మరియు దైవప్రవక్త (స) పలుకులు ఎన్నటికీ సత్య విరుద్ధం కాజాలవు. వాటిలో కొన్ని వ్యాధులు వైరస్‌ వల్ల వ్యాపిస్తుంటే మరికొన్ని తెలియని ఎన్నో కారణాల వల్ల విజృంభి స్తున్నాయి. స్వైన్‌ ప్లూ, చికెన్‌ గున్యా, డేంగూ వ్యాధులు ఈ మధ్యకాలంలో జన సముదాయాలను ఎలా గడ గడలాడించాయో విదితమే.
వప్రశ్న: చాడీలు చెప్పటం, పరోక్ష నిందకు పాల్పడటాన్ని దివ్య ఖుర్‌ఆన్‌ ఖండించడమేగాక, దానిని చనిపోయిన తమ మృత సోదరుని మాంసం తినటంగా అభివర్ణించింది. అయితే ఏదైనా షరీయతు పరమార్థంతో పరోక్ష నింద చేయటానికి అనుమతి ఉందా?
జవాబు: చాడీలు చెప్పడం, వీపు వెనుక నిందించటం, సాటి ముస్లిం సోదరులలోని తప్పులను ఎంచటం ముమ్మాటికీ తీవ్రమైన విషయం, ఘోర అపచారమే. కానీ ఈ ఆదేశాలన్నీ ఇస్లామీయ వ్యవస్థ యొక్క ఉద్దేశాలకు, పరిణామాలకు లోబడి ఉంటాయి. ఏదైనా ఒక షరీయతుపరమైన ముఖ్య విషయానికి సంబంధించి ఒకరి పరోక్షంలో నిందించవలసిన, రహస్యాన్ని బహిర్గతం చేయాల్సిన అగత్యం ఏర్పడితే తప్పు లేదు. పైగా ఒక్కోసారి గుట్టు రట్టు చేయటం అవశ్యమవుతుంది.
అందుకే చాడీలను నిరసించే హదీసులను క్రోడీకరించిన హదీసువేత్తలు, వాటిని వెల్లడించాల్సిన సమయం సందర్భాలను కూడా సూచించారు. ఉదాహరణకు:- ఇమామ్‌ బుఖారీ (రహ్మ) పెట్టిన ఒక మకుటంలో ”కలహాకారుల, కుత్సితుల గురించి మోపే నింద సమ్మతమే”. (బుఖారీ – 2/891)
ఈ హదీసుకు ఆధారంగా ఒక సంఘటన- ఒక వ్యక్తి దైవప్రవక్త (స)ను కలుసుకునేందుకు అనుమతి కోరగా ఆయన (స) అందుకు అనుమతించారు. ఇది ప్రవక్త (స)లోని మంచితానికి నిదర్శనం. మరో వైపు ఆయన (స) ఆ వ్యక్తి గురించి తన ధర్మపత్ని ఆయిషా (ర)కు చెబుతూ, ‘అతను తన వంశస్థులందరిలోకెల్లా చెడ్డవాడు’ అనన్నారు. (బుఖారీ)
అలాగే తన వద్దకు వివాహ సందేశం పంపిన ఇరువురు వ్యక్తుల నడవడిక గురించి హజ్రత్‌ ఫాతిమా బిన్తె ఖైస్‌ విచారించగా, ఆ ఇరువురు వ్యక్తులు కూడా ఆమెకు తగినవారు కారని దైవప్రవక్త (స) అబిప్రాయపడ్డారు.  ఆ ఇద్దరిలోనున్న లోపాలను ఆయన (స) ఆమెకు వివరించారు.


    గత్యంతరం లేని పరిస్థితిలో చాడీలు చెప్పడాన్ని ఇస్లామీయ విద్వాంసులు ధర్మ సమ్మతమన్నారు. ఉదాహరణకు:- అన్యాయాన్ని అడ్డుకోవడం, చెడుల నిర్మూలన, సంస్కరణ, ధార్మిక తీర్పులను కోరినప్పుడు, న్యాయస్థానంలో కేసు దర్యాప్తు జరుగుతున్నప్పుడు మొదలగునవి. ఒక వ్యవస్థలోని ప్రముఖులకు వారి తాబేదారుల నిజస్థితిని గురించి చెప్పటం, వివాహ సంబంధాల విషయంలో వధూవరుల గురించి ఉన్నదున్నట్టుల పరోక్షంలో వివరించటం, పాప కార్యాలకు, దురాచారాలకు పాల్పడేవారి గురించి నాయకులకు ఫిర్యాదు చేయటం కూడా ధర్మసమ్మతమే. (ఫత్‌హుల్‌ బారీ)

    ఫ్రీడం ఈజ్‌ రెస్పాన్సిబిలిటీ


    మేరా ముల్క్‌, మేరా దేశ్‌, మేరా యే వతన్‌
    శాంతికా, ఉన్నతికా, ప్రేమ పూవనం

    అవును విశ్వంలోనే విశిష్ఠమయినది మన దేశం. మనకు దేశం అంటే ఎంతటి అభిమానమంటే, రెపరెపలాడుతున్న మువ్వన్నెల జెండాను చూస్తే చాలు అన్నీ మర్చిపోతాము. ఏదో తెలియని మధురానుభూతి, మరేదో చైతన్యం వీటన్నింటికీ మించి మది నిండా పొంగి పొర్లే దేశాభి మానం. జాతీయ జెండాను చూడగానే మనం పులకించి పోతాము, పరవశించి పోతాము. బహుశా ఇదే భారతీయతలోని గొప్పతనమేమో! ప్రపంచంలో ఏ దేశానికి లేని మానవ సంపద మన సొంతం.
    మన ఈ స్వాతంత్య్ర భారత దేశం ఒకరిద్దరి కృషితో సాధ్యమయింది కాదు. ఒకరి కోసం కొందరు, కొందరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కరు పోరాడితే వచ్చింది కాదు నేటి మన ఈ స్వాతంత్య్రం. అందరి కోసం అందరూ కలిసి ఏక త్రాటిపై నిలిచి సమిష్టి పోరాడి సాధించుకున్నది నేటి మన ఈ స్వాతంత్య్రం. ఒక్క క్షణంలోనో, ఒక్క గంటలోనో, ఒక్క రోజులోనో వచ్చింది కాదు నేటి మన ఈ స్వాతం త్య్రం. కొన్ని వందల సంవత్సరాలు కలిసికట్టుగా పోరాడితే వచ్చింది నేటి మన ఈ స్వాతంత్య్రం. ఎంతో మంది అమరవీల, వీర జవానుల, చరితార్థుల త్యాగ ఫలితం నేటి మన ఈ స్వాతంత్య్రం. అద్వితీయంగా, అపురూపంగా నాటి స్వాంతంత్ర సంగ్రామం సాగింది గనకే,ఆ మహో న్నత అధ్యాయం నేటికీ అందరి చేతా కొనియాడ బడుతోంది. స్వాతం త్య్రమనే నిధి సాకారమయిన ఆ అద్భుత ఘట్టాన్ని తల్చుకున్నప్పుడల్లా భారతీయుడయిన ప్రతి పౌరుని హృదయంలో ఉద్వేగం ఉప్పొంగు తుంది. మది దాటిన సంతోషం ‘జైహింద్‌’ అని స్మరిస్తుంది.
    భారత దేశ చరిత్రలో స్వాతంత్య్రోద్యమం ఓ మహోజ్వల ఘట్టం. భార తీయుల పోరాట పటిమకు, త్యాగనిరతికి, నిరుపమాన దేశాభిమానా నికి ఈ సమరం నిలువుటద్దం.ఈ సమరాన్ని సుసంపన్నం చేసేందుకు జాతి, మత, కుల, ప్రాంతీయతలను విస్మరించి భారతీయులంతా ఏకో న్ముఖంగా ఆత్మార్పణలకు పోటీ పడటటం అమోఘం,అమేయం, అపూ ర్వం. ఒకే నినాదంగా, ఒకే లక్ష్యంతో, ఒకే మాటగా, ఒకే బాటగా కోట్లాది ప్రజానీకం ముందుకు సాగడం ప్రపంచ చరిత్రలోనే అరుదైన మహత్తర ఘట్టం.
    ఈ పోరాటానికి భారత దేశపు అతి పెద్ద అల్ప సంఖ్యాక వర్గమయిన ముస్లిం సమాజం తనదైన భాగస్వామ్యాన్ని అందించింది. అపూర్వ త్యాగాలతో, అసమాన సాహసాలతో భారత ముస్లింలు మాతృభూమి విముక్తి పోరాటంలో పాల్గొని పునీతులయ్యారు. -
    భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి నేటికీ 67 వసంతాలు. కొన్ని రోజుల క్రితమే మనం 65వ గణతంత్ర సంబరాల్ని జరుపుకున్నాము. ఈ సుదీర్ఘ కాలంలో భారత్‌ పరిస్థితి మూడడుగులు ముందుకు రెండ డుగులు వెనక్కి అన్న రీతిలో ముందుకు సాగుతోంది.ఇందుకు ప్రధాన కారణం-స్వార్థపరులు, అవినీతిపరులు, అక్రమార్కులు, అసమర్థుల యిన నాయకులు, అటువంటి నేతలను ఎన్నుకొన్న ప్రజలు-మనం కూడా. నేడు మనం రాజకీయంగా ఎంతో చైతన్యవం తులయినప్పటి కీ, విద్యావంతులయినప్పటికీ కుల, మత, ప్రాంత, భాష వంటి వల్ల తీవ్ర ప్రభావితులయిన కారణంగా, సదరు నేత ఎంత అవినీతిపరుడ యినా, అయోగ్యుడయినా,నరరూప రాక్షసుడని తెలిసినా, తమ కులం వాడో, తమ మతంవాడో అయితే అతని అక్రమాలను, అఘాయిత్యాలను పట్టించుకోకూడదనే ఒక మూర్ఖ సిధ్ధాంతానికి లొంగి బ్రతకడమే కాక, సదరు నేత వేల మంది ప్రాణాలు పోవడానికి కారణమయినా అతన్ని విమర్శించినవారిని ఎదుర్కొవడం తమ నైతిక బాధ్యతగా భావి స్తున్నాము గనకే అట్టి అవినీతిపరుల ఆటలు ఇంకా కొనసాగుతు న్నాయి.
    కావాల్సినంత ధనదాహం…టాక్స్‌ సేవింగ్‌కి సరిపడేంత దానగుణం ..ఒంటి నిండా స్వార్థం..ఊరి నిండా లంచం..వ్యవస్థ మొత్తం అస్త వ్యస్థం..హృదయం-శ్మశానమంత విశాలం..గుణం-మానభంగం చేసే ంత పైశాచికం..చచ్చేంత భయం..చప్పేంత ధైర్యం…మౌనం కూడా సిగ్గు పడేంత చేతకానితనం..ఎప్పుడూ కలహం..అప్పుడప్పుడు ఐకమ త్యం…ఇది నేటి మన భాతరం. ఇదా మన పెద్ద ఆశించిన దేశం? ‘నా దేశం చంద్రుని మీద మనిషిని నిలబ్టెకపోయినా ఫర్వా లేదు, భూమ్మీద మనిషిని మనిషిగా చూస్తే చాలు’ అని డా.అంబేడ్కర్‌ చేప్పిన మాట అక్షరాల అచరణీయం.
    మన పూర్వీకులు శ్రమకోర్చి మనకు స్వాతంత్య్రాన్ని సంపాదించి పెట్టారు…ఎంత స్వాతంత్య్రం అంటే, ఉగ్రవాదంఅనుకుంటూనే… విచక్షణారహితంగా కాల్పులు, పేలుళ్లు జిరిపేతంట, ప్రేమించలేదని ఆసిడ్‌ దాడి చేసేటంత, కట్నం తేలేదని కాటికి పంపించేటంత, అమ్మ నాన్నను వృధ్దాశ్రమానికి తరలించేంతట…ఆఖరికి సహజీవనం చేసే టంత, స్వలింగ సంపర్కానికి అధికారికంగా అనుమతి కోరేటంత, సొంత ప్రాణం తీసుకునే అంత, ఇతరుల స్వేచ్ఛను హరించేటంత స్వాతంత్య్రాన్ని సంపాదించుకున్నాము..శభాష్‌!
    ‘ఫ్రీడం ఈజ్‌ రెస్పాన్సిబిలిటీ’ బాధ్యతారహిత స్వేచ్ఛ ‘పిచ్చోడి చేతి లో రాయి’ చాలా ప్రమాదకరం…మనకి వద్దు. మనం ప్రశాంతంగా బ్రతుకుతూ ఇతరులను కూడా ప్రశాంతంగా బ్రతకనిస్తే అది స్వేచ్ఛ. లేకపోతే అది జంతు స్వేచ్ఛ. కాబట్టి మన ప్రవర్తనను సమీక్షించు కుంటూ ముందడుగు వేయాలి. కోట్లాది జన హృదయాల ఆశలకు అనుగుణంగా మన భారతావనిని తిర్చిదిద్ది మన దేశ శక్తికి కీర్తి కిరి టాలు తొడిగించేందుకు ఆందరు కలిసికట్టుగా ముందుకు వస్తారని ఆశిస్తూ…!

    ప్రపంచ మతాలలో దైవ భావన



    జొరాస్ట్రియన్‌ (పారశీక) మతంలో దైవభావన

    జొరాస్ట్రియన్‌ మతం ఒక ప్రాచీన ఆర్యమతం. ఇది క్రీ.పూ. 2500 సంవత్సరాలకు పూర్వం ఫారస్‌ (ఈరాన్‌)లో ఉద్భవిం చింది. దీని అనుయాయుల సంఖ్య చాల తక్కువగా ఉంది. అంటే మొత్తం ప్రపంచంలో ఒక లక్షా ముఫ్ఫై వేలకు కూడా తక్కువగానే ఉంది. అయితే ప్రపంచ ప్రాచీన ధర్మాల్లో ఇది ఒకటిగా పరిగణింప బడుతుంది. ఈరాన్‌కు చెందిన ‘జర్‌తష్త్‌’ (జొరా స్టర్‌)అనే వ్యక్తి దీన్ని ప్రారంభించాడు. అందుకే దీన్ని జొరాస్ట్రియన్‌ మతం అని, పారశీక ధర్మం అని కూడా పిలుస్తారు. ‘దసాతీర్‌’ మరియు ‘ఆవెస్త’ పారశీకుల పవిత్ర మత గ్రంథాలు.
    పారశీక ధర్మంలో దేవుని కోసం ‘అహూర్‌ ముజ్‌దా’ అనే పదం వాడబడింది.’అహూర్‌’ అంటే యజమాని, ప్రభువు. ‘ముజ్‌దా’ అంటే ‘వివేకవంతుడు’ అనే అర్థం వస్తుంది. ఈ విధంగా ‘అహూర్‌ ముజ్‌దా’కు అర్థం వివేకవంతుడైన యజమాని లేక ప్రభువు. ‘అహూర్‌ ముజ్‌దా’గా పిలువబడే భావనలో కూడా ‘దేవుని ఏకత్వ భావన’ ప్రబలంగా ఉన్నట్లు కనిపిస్తుంది.
    దసాతీర్‌లో దైవగుణాలు
    దసాతీర్‌లో ఈ క్రింద పేర్కొన్న దైవగుణాలు వర్ణించబడ్డాయి.
    1) ఆయన ఒక్కడే.
    2) ఆయనకు సరిసమానుడు వేరెవ్వరూ లేరు.
    3) ఆయనకు ఆరంభమూ లేదు, అంతమూ లేదు.
    4) ఆయనకు ఎవరూ తండ్రిలేడు, ఆయనకెవరూ కుమారుడు లేడు, ఆయనకు భార్యాలేదు, సంతానమూ లేదు.
    5) ఆయన శరీర రహితుడు,నిరాకారుడు.
    6) కళ్ళు ఆయన్ని చూడలేవు, మేధా మస్తిష్కాలతో ఆయన్ని ఊహించనలవికాదు.
    7) ఆయన గురించి మనం ఆలోచించే దానికన్నా,అత్యంత అధికుడాయన.
    8) మనకంటే కూడా ఆయన మనకు సమీపంలో ఉన్నాడు.ఆవెస్తాను అనుసరించి దైవగుణాలు
    ఆవెస్తా, గాథా మరియు యస్‌నాకు అనుసరించి దైవానికి ఎన్నో గుణాలున్నాయి. అందులో కొన్ని ఇవి:
    1) ఖాలిఖ్‌ (సృష్టికర్త) – యస్‌నా31-7 మరియు 11)
    (యస్‌నా-44-7) (యస్‌నా 50-11) యస్‌నా 51-7)
    2) అత్యంత శక్తిశాలి, మహోన్నతుడు. (యస్‌నా33-11) (యస్‌నా45-6)
    3) దాత-’హుదాయి’ ప్రసాదించేవాడు. (యస్‌నా33-11)
    (యస్‌నా48-3)
    4) సఖి-స్పెంటా (దాత, దయాళువు) (యస్‌నా. 34-4,5,7,9, 11,13,15) (యస్‌నా 44-2) యస్‌నా 45-5) (యస్‌నా 46-9) (యస్‌నా 48-3)

    యూదు మతంలో దైవభావన

    సామి ధర్మాల్లో యూదమతం ఒక ప్రముఖమైన ధర్మం. దాని అనుయాయుల్ని ”యూదులు” అని పిలుస్తారు. వారు హజ్రత్‌ మూసా(అలైహి) దైవప్రవక్త ప్రతిపాదించిన మిషన్‌పై విశ్వాసం కలిగి ఉంటారు.
    1) ఈ క్రింది వాక్యాలు, పాత నిబంధన (డెటర్‌నొమి) పుస్తకంలో నమోదు కాబడి ఉన్నాయి. అందులో మహనీయ మూసా(అ) ప్రవక్త హితబోధ చేస్తూ ఇలా అంటారు: హీబ్రూ ఆయత్‌ అను వాదం ఇలా ఉంది.
    ‘ఇస్రాయేలూ వినుము. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోనవా’. (ద్వితీయోపదేశ కాండము6-4)
    2) ఆ గ్రంథంలోనే ‘యెషయా’ అనే పపుస్తకంలో ఇలా వచ్చింది:
    నేను నేనే యెహోవాను నేను తప్ప వేరొక రక్షకుడు లేడు.’ (43-11)
    3) ‘దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను నన్ను పోలినవాడెవడును లేడు’. (యెషయా: 46-9)
    యూద ధర్మంలో విగ్రహారాధనను వ్యతిరేకిస్తూ ఇలా వచ్చింది.
    ‘నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పై ఆకాశ మందేగాని క్రింది భూమియందేగాని భూమి క్రింది నీళ్ళయందే గాని యుండు దేని రూపమునయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు. చాటికి సాగిల పడకూడదు. వాటిని పూజింప కూడదు’. (నిర్గమకాండము- 20: 3, 5)
    4) ”నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైనున్న ఆకాశ మందేగాని, క్రిందనున్న భుమియందేగానీ, భూమి క్రిందనున్న నీళ్ళయందేగాని, యుండు దేని పోలికనైన విగ్రహమును చేసికొనకూడదు. వాటికి నమస్కరింపకూడదు. వాటిని పూజింప కూడదు. నీ దేవుడైన యెహోవాయగు నేను రోషము గల దేవు డను”. (ద్వితీయోపదేశ కాండము- 5:7-9

    ముహర్రమ్‌లో చేెస్తున్నదేమిటి?చేయాల్సిందేమిటి?



    ఇస్హాక్ జాహిద్

    మానవ జాతి చరిత్రలో ముహర్రమ్‌ మాసానికి గల ప్రాముఖ్యం ఎనలేనిది. హిజ్రీ క్యాలెండర్‌ ప్రకారం ఇది మొదటి నెల. అల్లాహ్‌ తరఫున నిషిద్ధ (పవిత్ర) మాసాలుగా ప్రకటించబడిన వాటిలో ఒక నెల. దీని గురించి అల్లాహ్‌ ఇలా సెలవిస్తున్నాడు:
    ''నిశ్చయంగా భూమ్యాకాశాలను అల్లాహ్‌ా సృష్టించినప్పటి నుండీ మాసాల సంఖ్య దైవగ్రంథంలో పన్నెండు మాత్రమే. వాటిలో నాలుగు మాసాలు నిషిద్ధమైనవి (పవిత్రమైనవి). ఇదే సరైన ధర్మం. కనుక ఈ నాలుగు మాసాలలో మీ ఆత్మలపై అన్యాయానికి ఒడిగట్టకండి''.  (అత్‌తౌబా: 36)

      ఇంతకీ ఆ నిషిద్ధ (పవిత్ర) మాసాలేవీ? దీనికి సమాధానం ఈ హదీసులో ఉంది:
    హజ్రత్‌ అబూ బక్రా (ర) కథనం ప్రకారం దైవ ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ''సంవత్సరం 12 మాసాలతో కూడుకున్నది. వాటిలో నాలుగు మాసాలు పవిత్రమైనవి (గౌరవనీయమైనవి, నిషిద్ధమైనవి). వాటిలో మూడు ఒక దాని తర్వాత ఒకటి వస్తాయి - అంటే జుల్‌ఖఅదా, జుల్‌ హిజ్జా, ముహర్రమ్‌ (మాసాలు). నాల్గవది రజబ్‌ మాసం. అది జమాదివుస్సానీకి - షాబాన్‌కి మధ్యన ఉన్నది''. (బుఖారీ)
      ''కాబట్టి (ఈ మాసాలలో) మీరు మీ ఆత్మలకు అన్యాయం చేసుకోకండి'' అని దేవుడు తాకీదు చేసి మరీ చెప్పడం గమనార్హం. ఆ మాటకొస్తే అన్యాయం, అక్రమం, దౌర్జన్యం అనేది ఎప్పటికీ నిషిద్ధమే. కాని ఈ నాలుగు మాసాల పేర్లను ప్రస్తావించి వాటి గౌరవ మర్యాదలకు, చారిత్రక ప్రాశస్త్యానికి విఘాతం కలిగించరాదని చెప్పడం వెనుక గల ఔచిత్యాన్ని మనం తరచి చూడాలి.

      ఇంతకీ ఇక్కడ అన్యాయం (జుల్మ్‌) చేయడమంటే అర్థం; ఈ మాసాలలో కయ్యానికి కాలు దువ్వటం, హత్యలు చేయటం, రక్త పాతం సృష్టించటం. దీనికి ఆధారం క్రింది వచనంలో ఉంది:
      'నిషిద్ధ మాసాలలో యుద్ధం చేయటం గురించి ఈ జనులు నిన్ను అడుగుతారు. (ఓ ప్రవక్తా!) ఆ మాసాలలో యుద్ధం చేయటం మహాపరాధం అని నీవు వారికి చెప్పు''. (అల్‌ బఖర: 217)

      ఇస్లాంకు పూర్వం (అజ్ఞానకాలంలో) కూడా ప్రజలు ఈ నాలుగు మాసాల పవిత్రతను దృష్టిలో పెట్టుకుని యుద్ధ విరమణ చేసేవారు. హింసాదౌర్జన్యాలకు దూరంగా మసలుకునేవారు. తర్వాత ఇస్లాం కూడా ఈ 'పవిత్రత'ను, 'ప్రతిపత్తి'ని అక్షరాల గౌరవిస్తూ వాటిలో యుద్ధాలు చేయటాన్ని ఘోర నేరంగా ఖరారు చేసింది.
      ఈ నాలుగు మాసాలలో దేవుని అవిధేయతకు ఒడిగట్టడం, దైవాజ్ఞల పట్ల ఉల్లంఘనకు పాల్పడటం, ధర్మంలో లేనిపోని పోకడలను సృష్టించుకుని అసభ్యంగా ప్రవర్తించడం కూడా అన్యాయం (జుల్మ్‌) క్రిందికి వస్తుంది.హాఫిజ్‌ ఇబ్ను కసీర్‌ (రహ్మ) హజ్రత్‌ ఇబ్ను అబ్బాస్‌ (శి) గారి మహితోక్తులను ఉటంకిస్తూ ఇలా అన్నారు: అన్యాయం ఎప్పుడు చేసినా అది అన్యాయమే. కానీ ఈ నాలుగు మాసాలలో దేవుడు విధించిన హద్దుల విషయంలో మరింత ఎక్కువ జాగ్రత్త పడాలి. ఈ నెలల్లో చేసిన సత్కార్యాలకు పుణ్యఫలం పెంచబడినట్లే, దుష్కార్యాలకు పాప ఫలం కూడా పెంచబడింది.

      ''ఈ మాసాలలో మీకు మీరే అన్యాయం చేసుకోకండి'' అనే వాక్యంపై వ్యాఖ్యానిస్తూ ఇమాం ఖతాదా (రహ్మ) ఇలా అన్నారు: ''అల్లాహ్‌ా తన దూతలలో సందేశహరునిగా ఒకరిని ఎన్నుకున్నాడు. తన వాక్కులలో అంతిమ గ్రంథంగా ఖుర్‌ఆన్‌ను ఎన్నుకున్నాడు. సమస్త భూమండలంలో మస్జిద్‌లను ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. మాసాలలో రమజాను మాసాన్ని, నిషిద్ధ మాసాలను ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. దినాలలో శుక్రవారాన్ని  ఎన్నుకున్నాడు. రాత్రులలో లైలతుల్‌ ఖద్ర్‌ను ప్రత్యేకంగా ఎంపిక చేసుకున్నాడు. అల్లాహ్‌ా తాను కోరిన దానికి (కోరిన వారికి) ఉన్నతిని ప్రసాదిస్తాడు. కనుక అల్లాహ్‌ా గొప్పగా భావించిన దానిని మీరు కూడా గొప్పగా పరిగణించండి''.  (తఫ్సీర్‌ ఇబ్ను కసీర్‌)
    సోదరులారా!
    మనం సంవత్సరం పొడుగూతా దేవుని అవిధేయతకు జడుస్తూ ఉండాలి. మరీ ముఖ్యంగా ఈ నాలుగు నిషిద్ధ మాసాలలో అపరాధాలకు, అజ్ఞోల్లంఘనకు దూరంగా ఉండాలి. ఇహపరాలలో నాశనం చేసే చేష్టల నుండి మనల్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఘోర అపరాధాల, అవిధేయతా  చేష్టల మూలంగా ఆంతర్యం కలుషితమవు తుంది. హృదయానికి తుప్పు పడుతుంది. అల్లాహ్‌ా ఏమన్నాడో చూడండి:
    ''ఎంత మాత్రం కాదు, అసలు వారి హృదయాలకు వారి దురాగతాల కారణంగా తుప్పు పట్టింది''. (తత్ఫీప్‌: 14)
    ప్రవక్త మహనీయులు (స) ఈ నేపథ్యంలో ఏమన్నారో చూద్దాం:

      ''విశ్వాసి (మోమిన్‌) పాపం చేసినప్పుడు అతని హృదయంపై ఒక నల్లని మచ్చ ఏర్పడుతుంది. మరి అతను గనక పశ్చాత్తాపం చెంది, ఆ తప్పిదానికి దూరంగా ఉంటే అది అతని హృదయాన్ని ప్రక్షాళనం చేస్తుంది. అలాకాకుండా అతను గనక యదేచ్ఛగా పాపకార్యాలు చేస్తూ పోతే అతని హృదయంపైని మచ్చ పెరుగుతూ పోతుంది. చివరికి అది అతని ఆంతర్యాన్ని పూర్తిగా కమ్మేస్తుంది. 'తుప్పు అంటే ఇదే', దీన్ని గురించే అల్లాహ్‌ా ఖుర్‌ఆన్‌లో ప్రస్తావించాడు''. (తిర్మిజీ, ఇబ్ను మాజా)
      జాగ్రత్త! పాపాలు చేసేవారి జీవితంలో ప్రశాంతత ఉండదు. నిత్యం వారి జీవితాల్లో వ్యాకులత, చీకు ఉంటుంది. ఈ విషయాన్ని అల్లాహ్‌ా కూడా తన గ్రంథంలో ప్రస్తావించాడు:
    ''ఎవరైతే మా సన్మార్గం పట్ల విముఖత చూపుతాడో అతను ప్రపంచంలో లేమితో బాధపడతాడు. ప్రళయ దినాన మేమతన్ని గుడ్డివానిగా చేసి లేపుతాము. 'ప్రభూ! నీవు నన్ను గుడ్డివానిగా చేసి లేపావేమిటి? నాకు కంటి చూపు ఉండేది కదా!' అని  అడుగుతాడు.    'నీకు ఇలానే జరగాలి. ఎందుకంటే నీ వద్దకు మా సూచనలు వచ్చినప్పటికీ నువ్వు వాటిని విస్మరించావు. కాబట్టి ఈ రోజు నిన్ను కూడా విస్మరించటం జరిగింది'' అని అల్లాహ్‌ అంటాడు. అంటే దైవ ధర్మం పట్ల వైముఖ్యం కనబరచి, ఖుర్‌ఆన్‌ సూక్తుల పారాయణం పట్ల అనాసక్తత చూపి, వాటికనుగుణంగా అవలంబించిన వ్యక్తిని  నలువైపుల నుంచీ దరిద్రం చుట్టుకుంటుంది. అతని రోజువారి సంపాదన బాగానే ఉన్నప్పటికీ జీవితంలో శాంతి, తృప్తి కరువైపోతాయి. మరణించిన మీదట సమాధి కూడా కుంచించుకుపోతుంది. సుదీర్ఘమైన బర్జఖ్‌ అవస్థలో ఎన్నో కఠినమైన యాతనలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇక పునరుత్థాన దినమున అతన్ని లేపినప్పుడు కంటి చూపుతో పాటు మనో నేత్రం కూడా లేకుండా పోతుంది. దైవం మనల్ని ఈ దుస్థితి నుండి కాపాడు గాక!
    అందుకే మనం అసంఖ్యాఖమైన దైవానుగ్రహాలకుగాను కృతజ్ఞులమై ఉండాలి. కృతజ్ఞతకు అత్యుత్తమ మార్గం మనం దైవాజ్ఞలకు కట్టుబడి ఉండటం, అవిధేయతకు, ఆజ్ఞోల్లంఘనకు దూరంగా ఉండటమే.

    ముహర్రమ్‌ మాసంలో వింత సంతాపం
     ముహర్రమ్‌ నెలలో కొంతమంది దుస్తులు చించుకుంటూ, రొమ్ములు బాదుకుంటూ, కత్తులతో పొడుచుకుంటూ వికృత పద్ధతిలో సంతాపపం పాటిస్తారు. మా దృష్టిలో ఇది కూడా అన్యాయం (జుల్మ్‌)లో ఒక రకమే. ఇది నిషిద్ధం. ఇలాంటి వికృత పోకడల గురించి దైవ ప్రవక్త (స) ఇలా హెచ్చరించారు.
    ''అజ్ఞానకాలపు చేష్టలలో నాలుగు చేష్టలు నా ఉమ్మత్‌ (అనుచర సమాజం)లో ఉంటాయి. వాటిని వదలటానికి కొంత మంది సిద్ధమవరు. జాతి (దురభిమానం) కారణంగా అహంభావం ప్రదర్శించటం, వేరొకరి వంశాన్ని గురించి చులకనగా మాట్లాడటం, నక్షత్రాల ద్వారా జాతకాలు తెలుసుకోవటం, (లేదా నక్షత్రాల ద్వారా వర్షాన్ని కోరటం), అసహ్యకరంగా రోదించి సంతాపం తెలుపటం''.

      ఆయన (స ) ఇంకా ఇలా అన్నారు: ''పెడబొబ్బలతో సంతాపం తెలిపే స్త్రీ గనక మరణించక ముందే పశ్చాత్తాపం చెందకపోతే, ప్రళయ దినాన లేపబడినప్పుడు ఆమె ఒంటిపై తారు చొక్కా ఉంటుంది. వ్యాధికి సంబంధించిన దుస్తులు ఆమె శరీరానికి ఆచ్ఛాదనగా ఉంటాయి''. (ముస్లిం)
     పై హదీసు ద్వారా అవగతమయ్యేదేమిటంటే పెడబొబ్బలు పెట్టడం, రొమ్ములు బాదుకోవటం అజ్ఞానకాలపు చేష్టల్లో ఒకటి. దీనికి ఇస్లాంతో ఎలాంటి సంబంధం లేదు. ఇలాంటి చేష్టలకు పాల్పడేవారితో తనకెలాంటి సంబంధం లేదని చెబుతూ మహా ప్రవక్త (స ) ఇలా అన్నారు:
    ''ముఖంపై అదే పనిగా లెంపలేసుకునేవాడు, చొక్కా చించుకుని రోదించేవాడు, అజ్ఞానకాలంలో మాదిరిగా పిచ్చిగా అరుస్తూ ఉండేవాడు, కష్టకాలంలో చావు కోసం కేకలు వేసేవాడు మావాడు కాడు''. (సహీహ్‌ బుఖారీ)

    ప్రియమైన పాఠకులారా!
    ముహర్రమ్‌ నెలలో మనవారిలో చాలా మంది మహా ప్రవక్త (స ) ముద్దుల మనవడైన హజ్రత్‌ హుసైన్‌ (ర ) గారి అమరగతికి సంతాప సూచకంగా 'మాతం' చేస్తుంటారు. హజ్రత్‌ హుసైన్‌ (శి) గారి అమరగతిని తలచుకొని దుఃఖంతో విలపించని వారెవరుంటారు చెప్పండి? నిజానికి ప్రతి ముస్లిం ఈ విషాదకర సంఘటనపై   బాధతో  కృంగిపోతాడు. అయితే    కష్టకాలంలో   సదా   ఓర్పుతో  వ్యవహరించినట్లే హజ్రత్‌ ఇమాం హుసైన్‌  (ర ) వీర మరణం విషయంలో కూడా నిగ్రహంతో వ్యవహరించాలి. ఏ విలువల, ఆదర్శాల కోసం ఆ వీర పురుషుడు పోరాడారో వాటిని మనమూ పునరుద్ధరించేందుకు ప్రయత్నించాలి. అవేవీ చేయకుండా ఆవేశంతో ఊగిపోవటం, రొమ్ములు బాదుకుని మాతం చేయటం, కత్తులతో పొడుచుకుని రక్తం చిందిచటం సభ్యతా కాదు, సత్సంప్రదాయమూ కాదు. ''సహనం వహించేవారికి అల్లాహ్‌ లెక్కలేనంత పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాడు''. (జుమర్‌: 10)
      ఇమామ్‌ హుసైన్‌ (ర ) గొప్ప సహాబీ అన్నది నిర్వివాదాంశం. ఆయన గొప్పతనం గురించి అర్థం చేసుకోవడానికి ఆయన (శి) మహా ప్రవక్త (లి) గారి ముద్దుల మనవడు అన్న విషయం ఒక్కటి చాలు. తన మనవళ్ళయిన హసన్‌, హుసైన్‌ (ర )లను ప్రవక్త (స ) అమితమైన అవ్యాజానురాగాలతో చూసుకునేవారు. ఒక ఉల్లేఖనం ప్రకారం మహా ప్రవక్త (స ) ఒకసారి తన మనవళ్ళిద్దరినీ హృదయానికి హత్తుకుని ''ఓ అల్లాహ్‌ా! నేను వీరిద్దరిని ప్రేమిస్తున్నాను. కనుక నీవు కూడా వీళ్ళని ప్రేమించు'' అని ప్రార్థించారు.  (ముస్నద్‌ అహ్మద్‌)

      హజ్రత్‌ అబూ హురైరా (ర ) ఇలా తెలిపారు: ఒక రోజు దైవప్రవక్త (స ) మా ఇంటికి వచ్చారు. ఆ సమయంలో హసన్‌ హుసైన్‌లిద్దరూ ఆయన (స ) వెంటనే ఉన్నారు. ఒక భుజంపై హసన్‌, మరో భుజంపై హుసైన్‌ కూర్చొని ఉన్నారు.  ప్రవక్త (స ) ఒకసారి ఒక మనవణ్ణి, మరోసారి రెండో మనవణ్ణి ముద్దు పెట్టుకుంటున్నారు. ఈ వైనాన్ని గమనించిన ఒక శిష్యుడు, ''ఓ దైవ ప్రవక్తా (స )! తమరు వీళ్ళని ఇంతగా ప్రేమిస్తున్నారా?'' అని అడగనే అడిగేశాడు. మహాప్రవక్త (స) ఈ మాటకు సమాధానమిస్తూ ''ఎవడైతే వీళ్ళని ప్రేమించాడో  అతను నన్ను ప్రేమించాడు. ఎవడైతే వీళ్ళని ద్వేషించాడో అతను నన్ను ద్వేషించాడు'' అన్నారు. (అహ్మద్‌)
      ఈ విధంగా చెప్పుకుంటూపోతే ప్రవక్త మనుమల గొప్పతనాన్ని సూచించే హదీసులు ఇంకా ఎన్నో వస్తాయి. ఈ హదీసుల దృష్ట్యా మనమంతా హస్‌నైన్‌లను హృదయపూర్వకంగా ఆదరించాలి. హజ్రత్‌ హుసైన్‌ (ర ) అమరగతి చరిత్రలో అత్యంత విషాదకరమైన సంఘటనే. కాని ఏటేటా ముహర్రమ్‌ నెలలో ఆ సంఘటనను తలుచుకుని చేసే పనులు మాత్రం ధర్మసమ్మతం కావు. స్వయంగా మన ప్రవక్త (స ) అలాంటి చేష్టలను అధర్మంగా ఖరారు చేశారు.

      అందుకే హజ్రత్‌ హుసైన్‌ (ర ) గారి వీర మరణాన్ని దేవుని విధివ్రాతగా భావించాలి. ఈయన తండ్రి హజ్రత్‌ అలీ (ర ) గారి వీర మరణం కూడా విధి వ్రాత ప్రకారమే జరిగింది. హిజ్రీ శకం 40వ సంవత్సరం రమజాను నెల 17వ తేదీ ఉదయం ఫజ్ర్‌ నమాజు కోసం వెళుతూ దైవ మార్గంలో అమరగతి నొందారు అమీరుల్‌ మోమినీన్‌ హజ్రత్‌ అలీ (ర ). అంతకు మునుపు తృతీయ ఖలీఫా హజ్రత్‌ ఉస్మాన్‌ (ర ) దుర్మార్గుల చేతుల్లో అమానుషంగా వధించబడ్డారు. హిజ్రీ శకం 36వ ఏట జుల్‌హిజ్జా నెల తష్రీఖ్‌ దినాలలో ఈ విషాదకర సంఘటన జరిగింది. అంతకు ముందు ద్వితీయ ఖలీఫా హజ్రత్‌ ఉమర్‌ ఫారూఖ్‌ (ర ) కూడా అమరగతినొందినవారే. అమరగతికి నోచుకున్న ఈ ముగ్గురు ఖలీఫాలు నిశ్చయంగా హజ్రత్‌ హుసైన్‌ (ర) కన్నా శ్రేష్ఠులే. కాని ఇలాంటి ఘటనలు సంభవించినపుడు మనం ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజివూన్‌ (మేము అల్లాహ్‌కు చెందిన వారము. నిశ్చయంగా మేము మరలిపోవలసింది ఆయన సన్నిధికే) అని అనటం తప్ప మరేమనగలం?                 

    ఉభయ కుశలోపరి


    ‘ఉభయ కుశలోపరి’ ఇచ్చట మేము క్షేమం…అచ్చట మీ యోగ క్షేమాలను నిరంతరం కోరుకుంటున్నాం. ఇది అమృతోపమానమయిన యోగక్షేమాల సమాచార వివరణ, ఆత్మీయపూర్వ స్మరణ! పత్రి పలుకులోనూ ‘భద్ర’ అనే భావం ఉండాలని, పత్రి మాట మంగళప్రదం అవ్వాలని, క్షేమం,శ్రేయం అందరికీ వరించేలా కోరుకోవాలని పెద్దలు చెప్పిన మాట నేటి తరానికి బంగారు మూట. దైవానుగ్రహం వల్ల మనకు వరించిన అదృష్టం మనం భారతీయులం అవ్వడం. ఆ అదృష్టం చేజారిపోకుండా భద్రంగా, స్థిరంగా నిలుపుకోవడంలోనే మనందరి శ్రేయో శుభాలు, అభ్యుదయం, పగ్రతి వికాసాలు దాగున్నాయి. తన వల్ల ఎదుటి వ్యక్తి ఎటువంటి హాని కలుగదు అని తెలియజేసే సంకేత పదమే ఇస్లాం నేర్పే అభివాదం – అస్సలాము అలైకుమ్‌ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు – మీపై శాంతి కురియుగాక! దేవుని కరుణ, శుభాలతో మీరు సదా వర్థిల్లుగాక!
    కడివెడు పాలను ఒక ఉప్పు కల్లు పాడు చేసినట్లు మనషుల మధ్య, మనసుల మధ్య వారధిగా నిలవాల్సిన మతం, కొందరి ఛాందసం కారణంగా వారిధిగా, పెద్ద ప్రమాదకారిగా మారడం సగటు భారతీయునికి ఆందో ళన కలిగించే అంశం. మతం మనిషికి ఎంత వరకు మేలు చేస్తుంది అన్న మీమాంసను ప్రక్కనబెడితే మతమే ఛాందసవాదుల దుర్వినియోగంతో విపరిణామానికి గురవుతోంది. నేడు మత ఛాందసం, మత మౌఢ్యం, మతోన్మాదం, మత దుర్వినియోగం దేశ అభ్యుదయానికి తూట్లు పొడుస్తోంది. మతం బోధించే మేలిమి గుణ రసాస్వాదనకు బదులు విషస్వాదన చేస్తున్నాడు మనిషి. హితాన్ని కోరేది మతమయితే, హఠం చేసేది, అన్య మతస్థులకు ఖతమ్‌ చేయాలనుకునేది మతం ఎలా అవుతుంది? అది ముమ్మాటికి ఉన్మాదమే, ఉగవ్రాదమే. ఒకే మతాన్ని అవలంబించి తీరాలని దైవమే బలవంతం చెయ్యనప్పుడు ఒకరి మతాన్ని, అభిమతాన్ని ఖండించేందుకు మనం ఎవరం? ”నీ పభ్రువే గనక తలచుకొని ఉంటే మనుషులందరినీ ఒకే సమూ హంగా చేసి ఉండేవాడు. కాని వారు మాతం విభేదించుకునే వారుగానే ఉంటారు”. (హూద్‌: 118) ”నీ పభ్రువు తలచుకుని ఉంటే భూమండలంలో ఉన్నవారందరూ విశ్వసించి ఉండేవారు. ఇది ఆయన నియతి అయినప్పుడు – ఏమి జనలందరూ విశ్వసించి తీరాల్సిందేనని నువ్వు వారిపై బలవంతం చేస్తావా?”. (యూనుస్‌: 99.100) ఆ విషయానికొస్తే – ”ధర్మం విషయంలో (ఎవరిపై) ఎలాంటి బలాత్కారం, బలవంతం లేదు”. (అల్‌ బఖరహ్‌: 256)
    ప్రక్కవాడి ఆస్తిని ప్రక్కవాడినే అనుభవించనిస్తున్నాం, పొరుగువాని ఇంటిలో పొరుగు వాడినే ఉండనిస్తున్నాం. దుఃఖంలో సుఖాన్నీ, వికారంలో అందాన్నీ, నలుపులో తెలుపునీ, చీకటిలో వెలుగునూ, వెలుగులో రంగులనూ గుర్తించినట్లే భారత సమాజంలోని మతాలన్నింని, సంపద్రాయాలన్నింని గుర్తించాలి. పక్రృతిసిద్ధ ద్వందాలు కలిస్తేనే సృష్టి పరిపూర్ణమవుతుంది. మానావ సమాజంలోనీ ఈ ద్వందాలు కలిస్తే భారత దేశం నింఢు శోభను సంతరించుకుంటుంది. కాబట్టి మానవ సమాజానికి హాని కానంత వరకూ ఎవరి మతాన్ని వారిని అనుసరించనిద్దాం! అలా కాదని విడిపోతే చెడిపోతాం. చెడిపోతే పడిపోతాం!
    ”ఒక జాతిని, దేశాన్ని చీల్చాలంటే అందుకు మతాన్ని మించిన ఆయుధం లేదు” అన్నాడు బెర్నాడ్షా . ”మత మౌఢ్యం భీతావహానికి కొలువు” అన్నారు వెనకటికి మన పెద్దలు. పప్రంచంలో మానవుల మధ్య ఎప్పుడు, ఎక్కడ కలతలు, కలహాలు చెలరేగినా, వైమనస్యాలు, వైషమ్యాలు, వైరాలు, దూరాలు పెరిగినా దానికి కారణం సదా ఒక్కటే – దుర్మార్గం, దురభిమానం, దురంహాకారం, భాషా వైషమ్యం, దేశం, ప్రాంతం, వంశం, వర్ణాల దురభిమానం, సంకుచిత జాత్యాహంకారం. మానవులంతా ఎన్ని శాఖోపశాఖలుగా విస్తరించినా అందరూ ఒకే వృక్ష కొమ్మలు రెమ్మలు. అందరూ ఒకే స్తీప్రురుష జంట ద్వారా ఉనికిలోకి వచ్చినవారే. ఒకే మూలం నుండి విస్తరించిన మానవాళి పక్రృతి సిద్ధంగా అనేక రంగుల్లో, తెగల్లో, జాతుల్లో విడిపోయింది. ఈ సహజ పరిణామాలు మనుషుల్లో నిమ్నోన్నత భావనలకు, హెచ్చుతగ్గులకు, ఎంత మాతం పమ్రాణాలు కావు. నిజానికి మానవుల మధ్య వ్యత్యాసం చూపగల పమ్రాణం, గీటురాయి ఏదయినా ఉందంటే అది కేవలం నైతికమైనది మాత్రమే. నైతికంగా ఉన్నతంగా ఉన్నవాడే మనుషుల్లో ఉత్తముడు. అతను నల్లవాడయినా, తెల్లవాడయినా, అరబ్బయినా, అమెరికనయినా, ఆర్యుడయినా, అనార్యుడయినా, పండితుడయినా, పామరుడయినా, నాస్తికుడయినా, ఆస్తికుడయినా, స్త్త్రీ అయినా, పురుషుడయినా సరే. ఖుర్‌ఆన్‌ ఇలా పేర్కొంటుంది:
    ”మానవులారా! మేము మిమ్మల్ని ఒక స్తీప్రురుషుల జంట ద్వారా పుట్టించాము. తరువాత మిమ్మల్ని జాతులుగా, వంశాలుగా చేశాము; మీరు ఒకరినొకరు గుర్తు పట్టగలగాలని. వాస్తవానికి అల్లాహ్‌ దృష్టిలోనయితే మీలో అందరికన్నా అధికంగా చెడులకు దూరంగా ఉండేవాడే, దైవభీతిపరుడే ఆదరణీయుడు”. (దివ్య ఖుర్‌ఆన్‌-49: 13)
    ఒకరి గురించి మాట్లాడి బంధాలు తెంచుకోవాల్సిన సందర్భం కాదిది; అందరితో మాట్లాడి సామరస్యాన్ని, సుహృద్భావాన్ని పెంచుకోవాల్సిన, పేమ్రానురాగాలను పంచుకోవాల్సిన, ఆదరాభిమానాలను కురిపించుకోవాల్సిన సమయమిది. స్వసంస్కృతీ నిష్ఠులైనా, స్వదేశానురాగులైనా – అన్య సంస్కృతు పట్ల, అన్య దేశాల, మతాల పట్ల గౌరవాలు పుష్కలంగా పద్రర్శించే సామరస్య ధోరణి నేటి ఆవశ్యకత. ఎవరి మతంలో వారిని మనుగడ సాగనిద్ధాం. ఇతర మతావలంబీకుల హక్కుల్ని, నమ్మకాలను కాల రాసి, స్వీయ మతానికి మచ్చ తీసుకురాకుండా మన మతానికి వన్నె తెచ్చి, మన దేశ గౌరవాన్ని, విశిష్ఠతను కాపాడుకుందాం! అప్పుడు అందరూ కనే ‘ఉభయ కుశలోపరి’ అనే పసిడి కల పుష్పిస్తుంది, మధుర ఫలాను అందిస్తుంది. అందు కోసం మనక్కావాల్సింది సహనం. హననం ఎంత మాతం కాదు. నేటి మన ఆవశ్యకత అందమయిన నినాదాలు కాదు, ఆచరణకు నోచుకునే విధానాలు!